12, సెప్టెంబర్ 2017, మంగళవారం
ఇంకెన్నాళ్లకు అధికారిక ఉత్సవం? (లోకహితం - సెప్టెంబర్ 2017 సంచిక)
సరిగ్గా 69యేళ్లక్రితం...స్వతంత్య్ర భారతావనిలో హైదరాబాద్ సంస్థానం
విలీనమైన రోజు. రజాకార్ల అరాచకాలు, నిజాం నవాబు చెర నుంచి విముక్తైన రోజు.
1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్య్రమని ప్రపంచానికి తెలుసు.
కానీ..హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాతే 1948 సెప్టెంబర్ 17వ తేదీన
దేశానికి పూర్తి విముక్తి లభించింది.
స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వానికి బ్రిటిష్
వాళ్లు పగ్గాలు అప్పగించా రు. అదే సమయంలో... 543 సంస్థానాలు కూడా దేశంలో
విలీనమయ్యాయి. కానీ నిజాం పాలన లోని హైదరాబాద్ సంస్థానం మాత్రం ససేమిరా
అంది. అప్పటివరకూ బ్రిటిష్ వాళ్లకు సామంతు డిగా కొనసాగిన హైదరాబాద్
నవాబు.. ఆసఫ్ జాహీ వంశస్థుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనది
స్వతంత్య్ర రాజ్యమని ప్రకటించు కున్నాడు.
దీంతో అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని హైదరాబాద్తో పాటు.. ఔరంగాబాద్,
నాందేడ్, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ తదితర ప్రాంతాల్లో నిజాం నిరంకుశ
పాలన కొనసాగింది. రజాకార్లు చెలరేగిపోయారు. హిందువులు కనిపిస్తే చాలు..
నరికి చంపేశారు. హిందూ మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నిజాం
నవాబు స్వతంత్య్ర రాజ్యంలో హిందువుల ఊచకోత కొనసాగింది. స్వతంత్య్ర
భారతదేశంలో కూడా మరో ఏడాదికి పైగా ఇక్కడి జనం అరాచకాల మధ్య నలిగిపోయారు.
ఈ క్రమంలోనే ఇక్కడి ప్రజలు భారతదేశంలో విలీనమైతే తప్ప తమకు భద్రత లేదని
భావించారు. మరోవైపు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోన్న భారత ప్రభుత్వం
'ఆపరేషన్ పోలో' చేపట్టింది. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల
మేరకు మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేత త్వంలోని భారత సైన్యం హైదరాబాద్
సంస్థానాన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టింది.
అదే సమయంలో భారత సైన్యాన్ని ఎదిరించి ఢిల్లీ ఎర్రకోటపైనే ఆసఫ్జాహీ
పతాకాన్ని ఎగురవేస్తామని అప్పటి రజాకార్ల నాయకుడు కాశీంరజ్వీ ప్రకటించా డు.
అటు రజాకార్లు గానీ.. ఇటు నిజాం సైన్యం గానీ.. అదే సమయంలో భారత సైన్యాన్ని
ఎదిరించేందుకు పాకిస్తాన్ సాయం కోరుతూ వర్తమానం పంపాడు నిజాం నవాబు.
అటు.. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిజాం నిరంకుశ పాలన నుంచి
ప్రజలను విముక్తి చేయాలన్న లక్ష్యంతో సెప్టెంబర్ 13వ తేదీన భారత
ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో' మొదలుపెట్టింది. నాలుగు రోజుల్లోనే నిజాంను
దారికి తెచ్చింది.
భారత ఆర్మీ ముందు నిలువలేక పోయాయి. ఓవైపు యుద్ధం సాగుతున్న సమయంలో
హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ఎక్కడికక్కడ భారత సైన్యానికి సహకరించి
నిజాం మూకలను అంతమొందించేందు కు సహకరించారు. ఫలితంగా భారత సైన్యం
హైదరాబాద్లో అడుగుపెట్టకముందే నిజాం నవాబు తన సంస్థానాన్ని భారతదేశంలో
విలీనం చేస్తున్నట్లు లొంగుబాటు ప్రకటించాడు.
కాలక్రమంలో రాష్ట్రాల విభజన తర్వాత హైదరాబాద్ సంస్థానంలోని మెజారిటీ
ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. కొన్ని జిల్లాలు మహా రాష్ట్రలోకి,
కర్నాటకలో అంతర్భాగమయ్యాయి. అయితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మినహా.. మిగతా
రాష్ట్రాల్లోని అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రాంతాల్లో సెప్టెంబర్
17వ తేదీన అధికారికంగా 'విమోచన దినోత్సవ వేడుకలు' నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అప్పటి హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక
రాష్ట్రంగా విభజించాలంటూ తెలంగాణ ఉద్యమం అరవయ్యో దశకంలోనే మొదలైంది. వేలాది
మంది ప్రాణాలు కోల్పోయినా.. కాంగ్రెస్ కుటిల నీతితో ఉద్యమాన్ని
అణచివేసింది. ఇక మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్.. తెలంగాణ
రాష్ట్రం ఏర్పడ్డాక 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' అధికారికంగా
నిర్వాహిస్తామని అనేకసార్లు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై
మూడేళ్లు గడిచినా ఆ మాటే మరిచారు. కేవలం హైదరాబాద్లోని రజాకార్ల వారసుల
పార్టీ అయిన ఎంఐఎంను నొప్పించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం విమోచన
ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదన్న వాదనలున్నాయి. ఈ క్రమంలోనే
బీజేపీ ప్రతియేటా నిరసన యాత్రలు చేపడుతూనే ఉంది. అధికారికంగా సెప్టెంబర్
17న విమోచన ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేస్తోంది. మరి ఈ ఎదురుచూపులు
ఇంకెన్నాళ్లో?
(-హంసిని సహస్ర సాత్విక)
11, ఏప్రిల్ 2017, మంగళవారం
గిల్గిత్లో గిల్లికజ్జాలు (లోకహితం ఏప్రిల్-2017 సంచిక)
- ఆర్థిక కారిడార్ పేరిట పాక్, చైనా కుట్రలు
మొదటి నుంచీ గిల్లికజ్జాలు పెట్టుకునే దాయాది దేశం పాకిస్తాన్కు
ఇప్పుడు పొరుగుదేశం చైనా జత కలిసింది. భారత్ను ఎప్పుడూ దొంగదెబ్బ
తీసేందుకు సిద్ధంగా ఉండే పాకిస్తాన్కు చైనా స్నేహం తోడయ్యింది. నేరుగా
భారత్ను ఎదుర్కొనే సాహసం చేయలేని చైనా.. ఈ క్రమంలోనే అటునుంచి
నరుక్కువస్తోంది. ఫలితంగా రెండు దేశాలు కలిసి కొత్త కుట్రకు తెర తీశాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిత్కు ఇప్పటిదాకా ఉన్న స్వతంత్ర
ప్రతిపత్తిని కాదని, రాష్ట్ర హోదా కల్పిస్తూ పూర్తిగా పాకిస్తాన్
ఆధిపత్యంలోకి వెళ్లేలా.. ఈ తర్వాత క్రమంగా చైనా పెత్తనం సాగించేలా
దుర్మార్గమైన ఆలోచన చేశాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్
భారతదేశానికి స్వాతంత్య్రం లభించడం, దేశ విభజన తర్వాత.. 1947 అక్టోబరు
22న పాకిస్తానీ మూకలు కాశ్మీర్ ఆక్రమణకు కుట్ర చేశాయి. కాశ్మీర్ మహారాజు
తమ రాజ్యాన్ని భారత్లో విలీనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి లేఖ
పంపగానే.. అక్టోబర్ 27వ తేదీ భారత వైమానిక దళాలు కాశ్మీర్ చేరుకున్నాయి.
భారత సైన్యం శత్రు సైన్యాలను తరిమికొట్టాయి. అప్పటికే జమ్మూ కాశ్మీర్
రాష్ట్రంలో మూడవ వంతు భూ భాగం పాకిస్తాన్ వశమైంది. 35 వేల చదరపు మైళ్ళు
వున్న ఈ భూభాగంలో విలువైన అడవులు, ఖనిజ సంపద వున్నది. బాల్టిస్టాన్,
గిల్గిత్, ముజఫరా బాద్ జిల్లాలలో పాకిస్తాన్ మూకలు వచ్చి చేరాయి.
దీనికి పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టింది.
సీపీఈసీ - చాపకింద నీరులా చైనా కుట్ర
భారత్ను దెబ్బతీసే కుట్రలో భాగంగా.. చైనా, పాకిస్తాన్ ఎకనమిక్
కారిడార్ (సీపీఈసీ)కు ఇరు దేశాలు కలిసి ప్లాన్ చేశాయి. ప్రధానంగా చైనా.. ఈ
విషయంలో దూకుడుగా వెళ్తోంది. రూ.2.85 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్న
సీపీఈసీ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తుండటంతో.. భవిష్యత్లో
భారత్తో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, తన చేతికి మట్టి అంటకుండా
పాకిస్తాన్తో పావులు కదిపిస్తోంది చైనా. అందులో భాగంగానే.. పాక్ ఆక్రమిత
కాశ్మీర్ పూర్తిగా పాకిస్తాన్ అధీనంలోకి తెచ్చుకునేందుకు వీలుగా..
గిల్గిత్కు రాష్ట్ర హోదా కల్పించేందుకు నిర్ణయిం చింది. ఇప్పటికే
పాకిస్తాన్లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఐదో రాష్ట్రంగా గిల్గిత్కు
రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొంటోంది. గిల్గిత్- బాల్టిస్తాన్కు
రాష్ట్ర హోదా కల్పించాలని ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారైన సర్తార్
అజీజ్ నేతత్వంలోని కమిటీ సిఫార్సు చేసినట్లు పాక్ మంత్రి రియాజ్
హుస్సేన్ పీర్జాదా మీడియాకు చెప్పారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా
చేయనున్నట్లు ఆయన చెప్పారు. అదే జరిగితే.. ఇక ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత
కాశ్మీర్ అని కాకుండా పాకిస్తాన్తో అంతర్భాగంగా పేర్కొనాల్సి ఉంటుంది.
అప్పడు చైనా పని కూడా సులువవుతుంది. అంతేకాదు.. భారత్ గుట్టుమట్లు
తెలుసుకునేందుకు కూడా చైనాకు వీలవుతుంది. ఈ క్రమంలోనే 2014లో పాకిస్తాన్
పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాకిస్తాన్ వెళితే సొంత
తమ్ముడి ఇంటికి వెళ్లినట్లు ఉంటుందంటూ పాక్ నేతలను ఆకర్షించే ప్రయత్నం
చేశారు.
గిల్గిత్-బాల్టిస్తాన్ భారత్లో అంతర్బాగమన్న బ్రిటన్
1947లో పాకిస్తాన్ కుట్రపూరితంగా ఆక్రమించుకున్న గిల్గిత్,
బాల్టిస్తాన్ ప్రాంతాలు భారత్లో అంతర్బాగమని బ్రిటన్ పార్లమెంట్
చారిత్రక తీర్మానం చేసింది. 200యేళ్ల పాలన తర్వాత భారతదేశానికి
స్వాతంత్య్రం ఇచ్చిన ఆంగ్లేయులే ఈ తీర్మానం చేయడం భారత్కు అత్యంత పదునైన
ఆయుధమని చెప్పవచ్చు. ఈ తీర్మానాన్ని కన్జర్వేటివ్ పార్టీ నేత బాబ్
బ్లాక్ మాన్ మార్చి 23న సభలో ప్రవేశపెట్టారు. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని
పాక్ తమ భూభాగంగా ప్రకటించుకోవడం సరికాదని ఈ తీర్మానం స్పష్టం చేసింది.
- హంసిని సహస్ర సాత్విక
- హంసిని సహస్ర సాత్విక
20, ఆగస్టు 2016, శనివారం
చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ డాక్యుమెంటరీ (రెడ్ అలర్ట్)
మనసులు దోచిన టీవీ స్టార్ ఉన్నట్టుండి శవమై తేలింది. ప్రియుడే కారణమన్నారు.. ఆధారాలూ ఉన్నాయన్నారు. ఆ తర్వాతే కథ మలుపు తిరిగిందా..? టీవీ స్టార్ సూసైడ్ మిస్టరీపై స్పెషల్ డాక్యుమెంటరీ.
యాంకర్ :
------------
ఫూల్స్డే నాడు జరిగిన ఆ సంఘటన అబద్ధమయితే బాగుండేది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే జీవితం ముగిసిపోయింది. కానీ.. ఆ విషాదం వెనుక ఎన్నో ప్రశ్నలు. ఎన్నెన్నో సందేహాలు. వాటిని మించిన ట్విస్ట్లు. అసలేం జరిగింది..? ఎలా జరిగింది..?
ఏప్రిల్ 1వ తేదీ... 2016వ సంవత్సరం...
ముంబైలో ఓ సెల్ఫోన్ మోగింది...
ఇవతలివైపు సోమా బెనర్జీ...
అవతలివైపు ఓ టీవీఛానెల్ రిపోర్టర్...
వాయిస్ ఓవర్ 1 :
ఏప్రిల్ 1వ తేదీ... 2016వ సంవత్సరం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓఇంట్లో సెల్ఫోన్ మోగింది. ఇవతలివైపు సోమా బెనర్జీ అనే పెద్దావిడ కాల్ ఆన్సర్ చేసింది. ఆమెకు ఫోన్ చేసి పలకరించింది ఓ టీవీఛానెల్ రిపోర్టర్.
స్పాట్...
మీ కూతురు ఎలా చనిపోయిందమ్మా..?
అమె ఆత్మహత్య చేసుకుందా..?
ఎవరైనా హత్య చేశారా..?
ఆత్మహత్య చేసుకుంటే కారణాలేంటి..?
హత్య చేసేంతటి శత్రువులెవరైనా ఉన్నారా..?
వాయిస్ ఓవర్ 2 :
మీ కూతురు ఎలా చనిపోయిందమ్మా..? అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశం మొత్తం అభిమానులను సంపాదించుకుంది. అమె ఆత్మహత్య చేసుకుందా..? ఎవరైనా హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుంటే కారణాలేంటి..? హత్య చేసేంతటి శత్రువులెవరైనా ఉన్నారా..? అవతలివైపు నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది.
స్పాట్...
వెల్లువలా ప్రశ్నలు
కోపంతో ఊగిపోయిన సోమా బెనర్జీ
ఏప్రిల్ఫూల్ చేయాలంటే వేరే కహానీలు చెప్పండి...
కూతురు చనిపోయిందంటూ ఫూల్ చేయాల్సిన అవసరం ఉందా..?
వాయిస్ ఓవర్ 3 :
ఒకదాని వెనుక మరొకటి.. ప్రశ్నలు వెల్లువలా వస్తుండటం.. అదీ తన కూతురు చనిపోయిందని చెబుతూండటంతో సోమా బెనర్జీకి కోపం నషాళానికంటింది. షటప్.. అంది ఒక్కసారిగా... ఏప్రిల్ ఒకటో తేదీ అని ఏప్రిల్ ఫూల్ చేయాలంటే ఇంకేవైనా కహానీలు చెప్పాలిగానీ.. నా కూతురు చనిపోయిందంటూ ఇంత ధైర్యంగా ఎలా చెబుతున్నావంటూ ప్రశ్నించింది. నేను ఫూల్ కాలేదని, ఫోన్ పెట్టేయాలని అరిచింది.
స్పాట్...
కీడు శంకించిన సోమా ముఖర్జీ
కూతురికి ఏమైనా ఆపద సంభవించిందా..?
నిజంగానే కూతురు చనిపోయిందా..?
వాయిస్ ఓవర్ 4 :
జర్నలిస్టుతో ఫోన్ సంభాషణ ముగించిన సోమా ముఖర్జీని ఏదో కీడు శంకించింది. ఎవరో టీవీ ఛానెల్ రిపోర్టర్ చెప్పినట్లు తన కూతురికి ఏమైనా ఆపద సంభవించిందా..? నిజంగానే తన కూతురు చనిపోయిందా..? ఇలా.. అనేక రకాల ప్రశ్నలు తన మెదడును తొలిచేస్తున్నాయి.
స్పాట్..
మరుసటి క్షణమే వినిపించిన పిడుగులాంటి వార్త
కూతురు విగతజీవిగా మారందన్న వార్త నమ్మలేకపోతోంది
కూతురు లేదని తెలిసి దు:ఖం కట్టలు తెంచుకుంది
వాయిస్ ఓవర్ 5 :
మరుసటి క్షణంలోనే.. ఆ తల్లి పిడుగులాంటి వార్త విన్నది. జర్నలిస్టు చెప్పింది నిజమేనని గ్రహించింది. తాను సొంతకాళ్లపై ఎదగడంతో పాటు... తమకూ పేరు ప్రతిష్టలు తెచ్చిన కూతురు ఇంత చిన్న వయసులోనే ఇలా విగత జీవిగా మారిందన్న వార్తను ఆమె నమ్మలేక పోతోంది. భవిష్యత్తుపై ఎన్నో కలల గూళ్లు కట్టుకున్న కూతురు లేదని తెలిసి దు:ఖం కట్టలు తెంచుకుంది.
స్పాట్...
మధ్యాహ్నం సమయం...
ముంబైలోని బంగూర్ నగర్...
ఓ ఇంట్లో యువతి ఆత్మహత్య...
సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతున్న యువతి...
ఉరేసుకుందని డిసైడైన స్థానికులు...
వాయిస్ ఓవర్ 6 :
ఏప్రిల్ ఒకటోతేదీ మధ్యాహ్నం సమయం. మరోవైపు.. ముంబైలోని బంగూర్ నగర్ కాలనీ అంతటా కలకలం చెలరేగింది. బంగూర్నగర్లోని ఓ ఇంట్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. సీలింగ్ ఫ్యాన్కు వేలాడటం చూసి వచ్చినవాళ్లు భయంతో వణికిపోతున్నారు. అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని నిర్ధారించుకున్నారు.
స్పాట్...
వయసు 24 యేళ్లుంటుంది...
అందరూ వచ్చేసరికే ఉరికి వేలాడుతోంది...
ఇరుగు పొరుగు వాసులకు గొడవలు గుర్తుకు వచ్చాయి...
ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు
కన్నీళ్లు పెట్టుకున్నారు
వాయిస్ ఓవర్ 7 :
అమ్మాయి వయసు 24 యేళ్లుంటుంది. చుట్టుపక్కల వాళ్లు అందరూ వచ్చేసరికే ఉరికి వేలాడుతోంది. ఈ దృశ్యం చూడగానే.. కొద్దిరోజులుగా ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఇరుగు పొరుగు వాసులకు గుర్తుకు వచ్చాయి. కానీ. .ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఇంత చిన్నవయసులోనే నూరేళ్లు నిండాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
స్పాట్...
కొంతసేపటికి ముందు ఆ ఇంట్లోనుంచి బయటికెళ్లిన యువకుడు
తిరిగొచ్చాక చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు
లోపలినుంచి గడియపెట్టుకుందన్నాడు
తలుపు తెరవడం లేదని ఆదుర్దాగా చెప్పాడు
గడియ.. అందరూ వచ్చాక తెరుచుకుందా..?
వాళ్లంతా రాకముందే ఆ యువకుడే తెరిచాడా..?
వాయిస్ ఓవర్ 8 :
ఈ సీన్ జరగడానికి కొంతసేపటిముందు ఆ ఇంట్లోనుంచి ఓ యువకుడు బయటికి వెళ్లాడు. కాసేపయ్యాక తిరిగొచ్చాడు. చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచాడు. అమ్మాయి లోపలినుంచి గడియ పెట్టుకుందని చెప్పాడు. ఎంత పిలిచినా తలుపు తెరవడం లేదని ఆదుర్దాగా చెప్పాడు. మరి.. లోపలినుంచి గడియ.. వాళ్లంతా వచ్చాక తెరుచుకుందా.. లేక అతనొక్కడే తెరిచాడా అన్నది మాత్రం స్పష్టం కాలేదు.
స్పాట్...
అమ్మాయిని కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్లారు
కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు
అప్పటికే చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు
సిద్ధార్థ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం
వాయిస్ ఓవర్ 9 :
అందరూ కలిసి లోపలికెళ్లి చూస్తే ఎదురుగా డెడ్బాడీ.. ఫ్యాన్కు వేలాడుతూ అమ్మాయి. హుటాహుటిన అమ్మాయిని కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. ఆ ఏరియాలోనే ప్రముఖమైన కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు. కానీ.. అప్పటికే ఆ యువతి చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఆస్పత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు.
స్పాట్...
అమ్మాయిది సొంతిళ్లు
కుటుంబసభ్యులు వేరేచోట ఉంటారు
అమ్మాయికి ఇంకా పెళ్లికాలేదు
అంత సంపన్నురాలా..?
యువతి ఒక్కర్తే ఇంట్లో ఉంటుందా..?
ఇంట్లోనుంచి బయటి కెళ్లిన యువకుడెవరు..?
కాసేపటికే ఎందుకు తిరిగొచ్చాడు..?
వాయిస్ ఓవర్ 10 :
అమ్మాయి చనిపోయిన ఇల్లు ఆమె సొంతిల్లు. కుటుంబసభ్యులందరూ వేరేచోట ఉంటారు. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. మరి.. ఈ వయసులోనే ఆ అమ్మాయికి సొంతిల్లు కొనుక్కునేంత ఆదాయం ఉందా..? అంత సంపన్నురాలా..? కుటుంబ సభ్యులంతా వేరేచోట ఉంటున్నారంటే.. ఆ యువతి ఒక్కర్తే ఆ ఇంట్లో ఉంటుందా..? మరి.. పెళ్లికాని ఆ యువతి ఇంట్లో నుంచి మధ్యాహ్నం వేళ బయటికెళ్లిన యువకుడెవరు..? ఆ తర్వాత కాసేపటికే అతను ఎందుకు తిరిగొచ్చాడు..? అన్నీ జవాబు లేని ప్రశ్నలే... ఇవన్నీ చిక్కుముడులే...
స్పాట్...
యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగానే కనిపించకుండా పోయాడు
సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు
వాయిస్ ఓవర్ 11 :
ఆ యువతి చనిపోయిన తర్వాత కాసేపు అక్కడే తచ్చాడిన యువకుడు.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగానే కనిపించకుండా పోయాడు. కొద్దిరోజుల దాకా అదృశ్యమయ్యాడు. సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
స్పాట్...
యువకుడికీ, అమ్మాయికీ సంబంధమేంటి..?
కొద్దిరోజుల దాకా పరారీలో ఎందుకున్నాడు..?
నిజంగా అమ్మాయిది ఆత్మహత్యేనా..?
అందుకు ప్రేరేపించింది ఎవరు..?
ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి.?
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా..?
వాయిస్ ఓవర్ 12 :
అమ్మాయి చనిపోయిన విషయం మొదట గుర్తించింది ఆ యువకుడే అయితే.. అతనికీ ఆమెకూ ఉన్న సంబంధమేంటి..? యువతి మరణం తర్వాత కొద్దిరోజులు ఎందుకు పరారీలో ఉన్నాడు..? అసలు ఆమె మృతికి. ఇతనికీ సంబంధముందా..? నిజంగా ఆ అమ్మాయిది ఆత్మహత్యేనా.. ఆత్మహత్యే అయితే అందుకు ప్రేరేపించింది ఎవరు..? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి.? లేదంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా..? ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలుగా మిగిలాయి.
స్పాట్....
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ఫేం.. ప్రత్యూష బెనర్జీ.
యువకుడు నిర్మాత రాహుల్రాజ్ సింగ్.
ఇద్దరూ లవర్స్.. కలిసి సహజీవనం కూడా చేశారు
వాయిస్ ఓవర్ 13 :
చనిపోయిన యువతి.. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ఫేం.. ప్రత్యూష బెనర్జీ. ఇప్పటిదాకా చెప్పుకున్న ఆ యువకుడు నిర్మాత రాహుల్రాజ్ సింగ్. ఇద్దరూ స్నేహితులు. కాదు.. కాదు.. లవర్స్.. అంతేకాదు.. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు.
స్పాట్...
హిందీలో 'బాలికా వధు'..తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'
దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు
చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ అంటే.. ఫ్యాన్స్ చెవి కోసుకుంటారు
నటనతో సీరియల్కే కలరింగ్ను తెచ్చిపెట్టిన ప్రత్యూష
అనేక సీరియళ్లలోనూ తనదైన నటనాశైలి
వాయిస్ ఓవర్ 14 :
హిందీలో 'బాలికా వధు' పేరుతో, తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా అనువాదమై ప్రసారమైన ఈ సీరియల్కు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఇక.. ఆ సీరియల్ ప్రధాన పాత్రధారి అయిన చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ అంటే.. ఫ్యాన్స్ చెవి కోసుకుంటారు కూడా. తన నటనతో మొత్తం సీరియల్కే కలరింగ్ను తెచ్చిపెట్టింది. అత్యద్భుతమైన నటనతో, అమాయకపు ఫోజులతో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.చిన్నవయసులోనే.. అద్భుతమైన అభిమానాన్ని చూరగొంది. ఇదొక్కటే కాదు.. అనేక సీరియళ్లలోనూ తనదైన నటనాశైలిని కనబర్చింది. అతిచిన్న వయసులోనే.. నటనారంగంలోకి ప్రవేశించిన అతికొద్ది కాలంలోనే పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది ప్రత్యూష బెనర్జీ. కానీ 24యేళ్ల వయసులోనే ఈలోకం విడిచి వెళ్లిపోయింది.
స్పాట్...
======================================
Chinnari Pellikuturi TWO - pkg (నేపథ్యం, సీరియల్స్)
========================
చిన్నారి పెళ్లి కూతురుగా సుపరిచితురాలైన ప్రత్యూష.. ఆ తర్వాత కెరీర్లో దూసుకుపోయింది. సీరియళ్లే కాదు.. రియాల్టీ షోలలోనూ పాల్గొంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక ఆదరణ సంపాదించింది.
మరుసటిరోజు ప్రత్యూషబెనర్జీ మృతదేహానికి అంత్యక్రియలు
అత్తారింటికి పంపేందుకు సిద్ధమవుతున్న కుటుంబసభ్యులు...
దు:ఖసాగరం మధ్య ప్రత్యూషను స్మశానానికి సాగనంపారు
పెళ్లి దుస్తులు డిజైన్ చేయాలంటూ డిజైనర్ రోహిత్ వర్మకు చెప్పిన ప్రత్యూష
ఆ విషయాన్ని తలచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చిన స్నేహితుడు
వాయిస్ ఓవర్ 1 :
తన ఇంట్లోనే ఉరేసుకున్న స్థితిలో కనిపించిన ప్రత్యూష బెనర్జీ మృతదేహానికి మరుసటిరోజు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యుల రోదనలు, అయిన వాళ్ల కన్నీటి మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యూష అంత్యక్రియల తంతు పూర్తయ్యింది. త్వరలోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేందుకు సిద్ధమవుతున్న కుటుంబసభ్యులు.. ప్రత్యూషను దు:ఖ సాగరం మధ్య స్మశానానికి సాగనంపారు. అంతేకాదు.. తొందర్లోనే తనకు పెళ్లి దుస్తులు డిజైన్ చేయాల్సి ఉంటుందని తన స్నేహితుడైన డిజైనర్ రోహిత్ వర్మకు చెప్పింది ప్రత్యూష. ఆమెను చివరి చూపులు చూసేందుకు వచ్చిన రోహిత్ వర్మ ఈ విషయాన్ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్వడం అక్కడున్న వాళ్లను కలచివేసింది.
స్పాట్...
ఆత్మహత్య కాదన్న కుటుంబసభ్యులు
ప్రియుడిపై అనుమానాలు
వాయిస్ ఓవర్ 2 :
ప్రత్యూష కళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. నుదుటి మీద తాజా సింధూరం కనిపిస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు కుటుంబసభ్యులు. అదృశ్యమైన ప్రియుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మరణానికి రాహులే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
స్పాట్...
ఆనంది పాత్రలో ప్రత్యూష బెనర్జీ
మొదట చిన్నారి పెళ్లికూతురు పాత్రలో అవికాగోర్
2013లో ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష బెనర్జీ
వాయిస్ ఓవర్ 3 :
చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో ఆనంది పాత్ర ద్వారా ప్రత్యూష బెనర్జీ మహిళల అభిమానాన్ని చూరగొంది. ఈ సీరియల్లో చిన్నారి పెళ్లికూతురు పాత్రలో మొదట అవికాగోర్ నటించింది. అవికాగోర్కు టాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు రావడంతో.. 2013లో ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. దీంతో.. ప్రత్యూష బెనర్జీ చిన్నారి పెళ్లికూతురిగా ఎంట్రీ ఇచ్చింది.
స్పాట్...
చిన్నారి పెళ్లికూతురుకు మరింత కళ
దేశవ్యాప్తంగా అభిమానులు
వాయిస్ ఓవర్ 4 :
ప్రత్యూష బెనర్జీ ఎంటరయ్యాక.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్కు మరింత కళ వచ్చింది. తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్లో నటనతో ఆకట్టుకున్న ప్రత్యూష.. తర్వాత మరికొన్ని సీరియల్స్లోనూ వివిధ పాత్రలు పోషించింది.
స్పాట్...
హిందీలో 'బాలికావధు'.. తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'
'ససురాల్ సిమర్కా' వంటి ఉత్తరాది సీరియల్స్
బిగ్బాస్ - 7, ఝలక్ దిఖ్ లాజా - 5...
కామెడీ క్లాసెస్ వంటి రియాల్టీ షోల్లో పాల్గొంది
వాయిస్ ఓవర్ 5 :
హిందీలో నిర్మించిన బాలికా వధు సీరియల్నే తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగా అనువాదం చేసి ప్రసారం చేశారు. అందులో హీరోయిన్ పాత్రను పోషించింది ప్రత్యూష బెనర్జీ. ససురాల్ సిమర్కాతో పాటు మరికొన్ని ఉత్తరాది టీవీ సీరియల్స్లోనూ నటించింది. బిగ్బాస్ - 7, ఝలక్ దిఖ్ లాజా - 5, కామెడీ క్లాసెస్ వంటి రియాల్టీ షోల్లోనూ ప్రత్యూష పాల్గొంది. అయినా.. అటు ఉత్తరాదిలో 'బాలికా వధుగా' ఇటు. .తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగానే టెలివిజన్ ప్రేక్షకులు ఆమెను ఆదరించారు.
స్పాట్...
కుటుంబ సభ్యుల్లోనే కాదు.. అభిమానుల్లోనూ విషాదం
వాయిస్ ఓవర్ 6 :
నటనారంగంలోకి ప్రవేశించిన అతితక్కువ కాలంలోనే పేరున్న సీరియల్స్లో నటించి, ప్రేక్షకుల మెప్పును పొందిన ప్రత్యూష బెనర్జీ మృతి ఇటు.. కుటుంబసభ్యులు, బంధువుల్లోనే కాదు.. అటు.. అభిమానుల్లోనూ విషాదం నింపింది.
స్పాట్...
మిస్టరీగా మారిన ప్రత్యూష మరణం
రకరకాల ఊహాగానాలు
షికార్లు చేసిన పుకార్లు
వారం రోజుల తర్వాత ప్రియుడు రాహుల్ అరెస్టు
వాయిస్ ఓవర్ 7 :
మరోవైపు.. ప్రత్యూష మరణం మిస్టరీగా మారింది. ప్రత్యూష చనిపోయిన రోజు ఆమెతో పాటే ఉన్న ప్రియుడు రాహుల్ రాజ్సింగ్ కనిపించకుండా పోవడంతో కొద్దిరోజులు కేసు ముందుకు సాగలేదు. మృతిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనేక పుకార్లు, వాదనలు షికారు చేశాయి. వారం రోజుల తర్వాత పోలీసులు ప్రత్యూష ప్రియుడు రాహుల్ను అరెస్టు చేశారు. ప్రత్యూషతో అతనికున్న అనుబంధం, చనిపోయే ముందు ఆమె మానసిక స్థితి, అసలు ఆమెది ఆత్మహత్యా..? హత్యా..? అన్న కోణాన్నీ విశ్లేషించే ప్రయత్నం చేశారు.
స్పాట్...
==========================================
Chinnari Pellikuturi Three - pkg
========================
యాంకర్ :
ప్రత్యూష బెనర్జీ మరణం వెనుక మిస్టరీ ఏంటి..? పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్పింది..? ప్రత్యూష ప్రియుడు పోలీసుల విచారణలో వెల్లడించిన అంశాలేంటి..? పోలీసులు దర్యాప్తులో ఏం తేల్చారు..? ప్రత్యూష బెనర్జీ కుటుంబసభ్యుల డిమాండ్ ఏంటి..? అసలు ఈ మరణం వెనుక ఏం జరిగింది.
రాహుల్ రాజ్సింగ్పై పలు సెక్షన్ల కింద కేసులు
14 గంటల పాటు రాహుల్పై ప్రశ్నల వర్షం
వాయిస్ ఓవర్ 1 :
సంచలనం సృష్టించిన ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్సింగ్పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 306, 505, 506 తదితర అభియోగాలతో కేసు నమోదు చేశారు. రాహుల్ను అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో ప్రశ్నించారు. ఏకధాటిగా 14 గంటల పాటు ప్రశ్నించి వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
స్పాట్...
దర్యాప్తు సమయంలోనే అనేక ఊహాగానాలు
చనిపోయేముందు ప్రియుడితో వాట్సాప్లో చాటింగ్
వాయిస్ ఓవర్ 2 :
ఓవైపు పోలీసుల దర్యాప్తు సాగుతున్న సమయంలోనే అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. చనిపోయేముందు ప్రత్యూష..తన ప్రియుడికి పుంఖాను పుంఖాలుగా వాట్సాప్ మెస్సేజ్లు పంపించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. చివరి ఫోన్కాల్ అతనికే చేసిందన్న విషయమూ నిర్ధారణ అయ్యింది.
స్పాట్...
బాయ్ఫ్రెండ్తో కలిసి మలాంద్లోని కార్నివాల్ మాల్కు ప్రత్యూష
రాహుల్ కొట్టడంతో కిందపడిపోయిన ప్రత్యూష
ఆరోజే ప్రత్యూష చనిపోయింది
వాయిస్ ఓవర్ 3 :
మరోవైపు.. ఆత్మహత్యకు ముందు.. ప్రత్యూష బెనర్జీ తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ తో కలిసి, మలాంద్లోని కార్నివాల్ మాల్ కు వెళ్లిందని, అక్కడే వాళ్లిద్దరికీ పెద్ద గొడవైందన్న ప్రచారం జరిగింది. ఈ గొడవలో రాహుల్.. ఆమెను గట్టిగా కొట్టాడని, కిందపడిన ఆమెను లేవదీసే ప్రయత్నం కూడా చేయలేదని, ఇది జరిగిన రోజే ఆమె చనిపోయిందని చెప్పుకున్నారు.
స్పాట్...
ప్రియుడితో ప్రత్యూషకు సమస్యలు
ప్రత్యూష ఫోన్తోనే పరారైన రాహుల్
వాయిస్ ఓవర్ 4 :
ఇక.. ప్రత్యూషను హాస్పిటల్కు తీసుకెళ్లాక.. రాహుల్ ప్రశాంతంగా చిప్స్ తింటూ గడిపాడని, అతనిలో టెన్షన్గానీ, బాధగానీ కనిపించలేదని ఆమె కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. చనిపోయే ముందు కొద్ది రోజులుగా ఆమె రాహుల్ రాజ్ సింగ్ తో సమస్యలు ఎదుర్కొంటోందని ఆమె సన్నిహితులు వాపోయారు. ఇక.. రాహుల్ పరారయ్యే ముందు ప్రత్యూష ఫోన్ కూడా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై ఆరోపణలు, అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.
స్పాట్...
ముందస్తు బెయిల్కోసం రాహుల్ ప్రయత్నాలు
బెయిల్ రద్దు చేయాలంటూ ప్రత్యూష తల్లి పిటిషన్
మహారాష్ట్ర సీఎంకు ప్రత్యూష తల్లి లేఖ
వాయిస్ ఓవర్ 5 :
పోలీసు కేసులు, ప్రశ్నల నేపథ్యంలో ముందస్తు బెయిల్ పొందేందుకు రాహుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ముంబైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేశాక.. దాన్ని రద్దు చేయాలంటూ అటు.. ప్రత్యూష తల్లి కూడా కోర్టును ఆశ్రయించింది. తమ కూతుర్ని చంపేసిన రాహుల్కి ముందస్తు బెయిలు ఇవ్వొద్దని వాదించింది. ఆ తర్వాత పోలీసులు రాహుల్ను అరెస్టు చేయడం, తర్వాత బెయిల్పై విడదల కావడం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత.. తమ కూతురి మృతి కేసులో నిందితుడైన ఆమె ప్రియుడు రాహుల్ తమను బెదిరిస్తున్నాడంటూ ప్రత్యూష తల్లి సోమా ముఖర్జీ ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
స్పాట్...
ప్రత్యూష చివరి ఫోన్కాల్ రికార్డింగ్ విన్న న్యాయస్థానం
'నన్ను క్యారెక్టర్ లేని దానిగా ముద్ర వేశారు...
నాకు జీవితంలో ఇంకేం మిగిలింది..? అని ప్రశ్నించిన ప్రత్యూష
వాయిస్ ఓవర్ 6 :
మరోవైపు.. ప్రత్యూష చివరి ఫోన్కాల్ రికార్డింగ్స్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆ ఫోన్.. ప్రియుడు రాహుల్రాజ్సింగ్కే చేసినట్లు నిర్ధారించారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోను న్యాయస్థానం విన్నది. తనను క్యారెక్టర్ లేని దానిగా ముద్రవేశారని, తనకు జీవితంలో ఇంకేం మిగిలిందని ప్రశ్నించింది ప్రత్యూష. అయితే.. ప్రత్యూష మాట్లాడుతుండగానే రాహుల్ ఫోన్ కట్ చేశాడని న్యాయస్థానం గుర్తించింది.
స్పాట్...
గతంలోనూ ప్రత్యూష ఆత్మహత్యాయత్నం
వాయిస్ఓవర్ 7 :
ఈ క్రమంలోనే మరో వాదన కూడా తోడైంది. ప్రత్యూష ఇలా ఎక్సట్రీమ్ స్టెప్ తీసుకోవటం తొలిసారి కాదని, గతంలో మాజీ బాయ్ ఫ్రెండ్తో విడిపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసిందని, అప్పుడు అదృష్టవశాత్తూ బతికిపోయిందని ఆమె స్నేహితులు తెలిపారు.
స్పాట్...
రెండుసార్లు సూసైడ్కు ప్రయత్నించిన ప్రత్యూష
ఓసారి విషం తాగింది...
మరోసారి బాల్కనీనుంచి దూకేందుకు ప్రయత్నించింది
వాయిస్ ఓవర్ 8 :
ప్రత్యూష గతంలోనూ రెండు సార్లు సూసైడ్కు ప్రయత్నించిందని ఆమె స్నేహితురాలు సారా ఖాన్ చెప్పింది. ఓసారి విషం తాగి చనిపోయేందుకు ప్రయత్నించిందని తెలిపింది. మరోసారి ఓ ఫంక్షన్కు వెళ్లినప్పుడు బాల్కనీ నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించిందని చెప్పింది. ఆ రెండు సందర్భాల్లో తానే కాపాడినట్లు కూడా సారా ఖాన్ వెల్లడించింది. చివరకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరు పెట్టుకుంది.
స్పాట్...
ప్రత్యూష కేసులో కొత్త ట్విస్ట్
చనిపోయేముందు మద్యం మత్తులో ప్రత్యూష
వాయిస్ఓవర్ 9 :
దర్యాప్తు సాగుతున్న కొద్దీ ప్రత్యూష కేసులో కొత్త ట్విస్ట్ బయట పడింది. చనిపోయే ముందు ప్రత్యూష మద్యం సేవించిందని తేలింది.
స్పాట్...
==========================================
R Alert Chinnari Pellikuturi Four - pkg
========================
ప్రత్యూష చనిపోయేముందు మద్యం తాగిందన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పైగా.. ప్రత్యూష రెండు నెలల గర్భవతి.. అంతేకాదు.. అబార్షన్ కూడా చేయించుకుంది. ప్రత్యూషకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు విస్తుగొలిపాయి.
బయటపడుతోన్న కొత్త అంశాలు
మోతాదుకు మించి తాగిందంటున్న మెడికల్ రిపోర్టు
గర్భవతి, అబార్షన్ కూడా చేయించుకుంది
వాయిస్ ఓవర్ 1 :
ప్రత్యూష కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ కొత్త కొత్త అంశాలు బయటపడ్డాయి. ప్రత్యూష చనిపోయేముందు విపరీతంగా మద్యం సేవించిందని తేలింది. 135 ఎంజీ ఆల్కాహాల్ తీసుకుందని మెడికల్రిపోర్టులో తేలినట్లు చెబుతున్నారు. ఇది యావరేజ్ కంటే చాలా ఎక్కువ అని అంటున్నారు. అంతేకాదు.. అమె గర్భవతి అని, అబార్షన్ కూడా చేయించుకుందన్న విషయం తెలిసి కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. తమ కూతురి చావుకు ఖచ్చితంగా ఆమె ప్రియుడే కారణమని తల్లిదండ్రులు వాదించారు.
స్పాట్..
ప్రత్యూష గర్భం దాల్చడం నిజమేనా..?
అబార్షన్ చేయించుకున్న విషయమూ వాస్తవమేనా..?
ఎందుకా నిర్ణయం తీసుకుంది..?
బంధాన్ని తెంచుకునేందుకే అబార్షన్ చేయించుకుందా..?
రాహుల్ ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడా..?
వాయిస్ ఓవర్ 2 :
పెళ్లికి ముందే ప్రత్యూష గర్భం దాల్చడం నిజమేనా..? అబార్షన్ చేయించుకున్న విషయమూ వాస్తవమేనా..? ఒకవేళ అదే నిజమైతే.. ఎందుకా నిర్ణయం తీసుకుంది..? రాహుల్తో గొడవల నేపథ్యంలో బంధాన్ని తెంచుకునేందుకే అబార్షన్ చేయించుకుందా..? లేదంటే రాహుల్ ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడా..? అన్న విషయాలూ మిస్టరీగా మారాయి.
ప్రత్యూష తాగుడుకు బానిసైందన్న రాహుల్
పరస్పర అంగీకారంతోనే అబార్షన్
వాయిస్ ఓవర్ 3 :
ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి సందేహాలను నివృత్తి చేశాడు. ఆమె తాగుడుకు బానిసైందని.. డ్రగ్స్, ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకోవడం అలవాటైందని, ఈ విషయం ఆమె స్నేహితులకు కూడా తెలుసని రాహుల్ పేర్కొన్నాడు. అంతేకాదు.. ప్రత్యూష గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించుకుందన్నాడు. పరస్పర అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకుందని కూడా చెప్పాడు. పోలీసుల విచారణలోనూ రాహుల్ ఇవే విషయాలు చెప్పి ఉంటాడని భావిస్తున్నారు.
స్పాట్...
ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు
పిచ్చాపాటీ ఉదయం దాకా కొనసాగింది
నిద్రలేచాక ప్రత్యూష మళ్లీ తాగుతూ కూర్చుందన్న రాహుల్
బయటికి వెళ్లివచ్చేసరికే దారుణం జరిగిపోయిందన్న రాహుల్
మందుకొట్టి మరీ తరచూ గొడవ పడేవాళ్లు
వాయిస్ ఓవర్ 4 :
ప్రత్యూష చనిపోయే ముందురోజు ఆమె ఇంట్లో తనతో పాటు.. మరో కామన్ ఫ్రెండ్ ముగ్గురం కలిసి పార్టీ చేసుకున్నామని, ఉదయం దాకా పిచ్చాపాటీ కొనసాగిందని రాహుల్ చెప్పాడు. తాను నిద్రలేచే సరికి ప్రత్యూష మళ్లీ తాగుతూనే కూర్చుందని, దీంతో ఇద్దరి మధ్యా చిన్న గొడవ జరిగిందన్నాడు. తినడానికి ఏమైనా తేవడానికి బయటికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగిపోయిందని బాధపడ్డాడు రాహుల్ రాజ్ సింగ్. అయితే.. వీరి అపార్ట్ మెంట్లలోని ఇరుగుపొరుగు వాళ్ళు కూడా ప్రత్యూష బెనర్జీ, రాహుల్ లు మందుకొట్టి మరీ తరచూ గొడవ పడేవారని చెబుతున్నారు. అంటే.. చనిపోయేముందు కొద్దిరోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు తీవ్రరూపం దాల్చాయన్నది మాత్రం వాస్తవమేనని తేలింది.
స్పాట్...
ప్రత్యూష కేసులో మరో ట్విస్ట్
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది
డబ్బు తల్లి అకౌంట్లో డిపాజిట్ చేసిందన్న రాహుల్
రాహులే డబ్బు డ్రా చేశాడన్న తల్లి
ప్రత్యూష అకౌంట్ నుంచి రాహుల్ ఖాతాలోకి రూ.24 లక్షలు
వాయిస్ఓవర్ 5 :
వీటికి తోడు.. ఈకేసులో మరో ట్విస్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవని, ప్రముఖ బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని తీవ్ర ఒత్తిడికి గురైందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె డబ్బంతా వాళ్ల అమ్మ అకౌంటులో డిపాజిట్ చేసేదని ప్రత్యూష బెనర్జీ ప్రియుడు రాహుల్ రాజ్ ఆరోపించాడు. మరోవైపు.. ప్రియాంక అకౌంట్ నుంచి ఆమె ప్రియుడు రాహులే డబ్బు డ్రా చేశాడని ప్రియాంక తల్లి కోర్టులో వాదించింది. అయితే.. ప్రత్యూష బ్యాంక్ అకౌంట్ నుంచి రాహుల్ ఖాతాలోకి 24 లక్షల రూపాయలు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
స్పాట్...
రాహుల్ రాజ్సింగ్వైపే అనుమానపు చూపులు
వాయిస్ ఓవర్ 6 :
ఇక.. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని, ఇది ఖచ్చితంగా హత్యే అని కుటుంబసభ్యులు వాదిస్తూనే ఉన్నారు. అయితే అందరూ ప్రత్యూష మృతి విషయంలో ఆమె ప్రేమికుడు రాహుల్ రాజ్ సింగ్ వైపు అనుమానంగా చూస్తున్నారు.
స్పాట్...
====================
End Anchor
-------------
తల్లిదండ్రుల అనుమానాలు, ప్రియుడి ప్రతివాదనల మధ్య... సాగుతున్న ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు బయటపడతాయో చూడాలి.
===================
యాంకర్ :
------------
ఫూల్స్డే నాడు జరిగిన ఆ సంఘటన అబద్ధమయితే బాగుండేది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే జీవితం ముగిసిపోయింది. కానీ.. ఆ విషాదం వెనుక ఎన్నో ప్రశ్నలు. ఎన్నెన్నో సందేహాలు. వాటిని మించిన ట్విస్ట్లు. అసలేం జరిగింది..? ఎలా జరిగింది..?
ఏప్రిల్ 1వ తేదీ... 2016వ సంవత్సరం...
ముంబైలో ఓ సెల్ఫోన్ మోగింది...
ఇవతలివైపు సోమా బెనర్జీ...
అవతలివైపు ఓ టీవీఛానెల్ రిపోర్టర్...
వాయిస్ ఓవర్ 1 :
ఏప్రిల్ 1వ తేదీ... 2016వ సంవత్సరం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓఇంట్లో సెల్ఫోన్ మోగింది. ఇవతలివైపు సోమా బెనర్జీ అనే పెద్దావిడ కాల్ ఆన్సర్ చేసింది. ఆమెకు ఫోన్ చేసి పలకరించింది ఓ టీవీఛానెల్ రిపోర్టర్.
స్పాట్...
మీ కూతురు ఎలా చనిపోయిందమ్మా..?
అమె ఆత్మహత్య చేసుకుందా..?
ఎవరైనా హత్య చేశారా..?
ఆత్మహత్య చేసుకుంటే కారణాలేంటి..?
హత్య చేసేంతటి శత్రువులెవరైనా ఉన్నారా..?
వాయిస్ ఓవర్ 2 :
మీ కూతురు ఎలా చనిపోయిందమ్మా..? అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశం మొత్తం అభిమానులను సంపాదించుకుంది. అమె ఆత్మహత్య చేసుకుందా..? ఎవరైనా హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుంటే కారణాలేంటి..? హత్య చేసేంతటి శత్రువులెవరైనా ఉన్నారా..? అవతలివైపు నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది.
స్పాట్...
వెల్లువలా ప్రశ్నలు
కోపంతో ఊగిపోయిన సోమా బెనర్జీ
ఏప్రిల్ఫూల్ చేయాలంటే వేరే కహానీలు చెప్పండి...
కూతురు చనిపోయిందంటూ ఫూల్ చేయాల్సిన అవసరం ఉందా..?
వాయిస్ ఓవర్ 3 :
ఒకదాని వెనుక మరొకటి.. ప్రశ్నలు వెల్లువలా వస్తుండటం.. అదీ తన కూతురు చనిపోయిందని చెబుతూండటంతో సోమా బెనర్జీకి కోపం నషాళానికంటింది. షటప్.. అంది ఒక్కసారిగా... ఏప్రిల్ ఒకటో తేదీ అని ఏప్రిల్ ఫూల్ చేయాలంటే ఇంకేవైనా కహానీలు చెప్పాలిగానీ.. నా కూతురు చనిపోయిందంటూ ఇంత ధైర్యంగా ఎలా చెబుతున్నావంటూ ప్రశ్నించింది. నేను ఫూల్ కాలేదని, ఫోన్ పెట్టేయాలని అరిచింది.
స్పాట్...
కీడు శంకించిన సోమా ముఖర్జీ
కూతురికి ఏమైనా ఆపద సంభవించిందా..?
నిజంగానే కూతురు చనిపోయిందా..?
వాయిస్ ఓవర్ 4 :
జర్నలిస్టుతో ఫోన్ సంభాషణ ముగించిన సోమా ముఖర్జీని ఏదో కీడు శంకించింది. ఎవరో టీవీ ఛానెల్ రిపోర్టర్ చెప్పినట్లు తన కూతురికి ఏమైనా ఆపద సంభవించిందా..? నిజంగానే తన కూతురు చనిపోయిందా..? ఇలా.. అనేక రకాల ప్రశ్నలు తన మెదడును తొలిచేస్తున్నాయి.
స్పాట్..
మరుసటి క్షణమే వినిపించిన పిడుగులాంటి వార్త
కూతురు విగతజీవిగా మారందన్న వార్త నమ్మలేకపోతోంది
కూతురు లేదని తెలిసి దు:ఖం కట్టలు తెంచుకుంది
వాయిస్ ఓవర్ 5 :
మరుసటి క్షణంలోనే.. ఆ తల్లి పిడుగులాంటి వార్త విన్నది. జర్నలిస్టు చెప్పింది నిజమేనని గ్రహించింది. తాను సొంతకాళ్లపై ఎదగడంతో పాటు... తమకూ పేరు ప్రతిష్టలు తెచ్చిన కూతురు ఇంత చిన్న వయసులోనే ఇలా విగత జీవిగా మారిందన్న వార్తను ఆమె నమ్మలేక పోతోంది. భవిష్యత్తుపై ఎన్నో కలల గూళ్లు కట్టుకున్న కూతురు లేదని తెలిసి దు:ఖం కట్టలు తెంచుకుంది.
స్పాట్...
మధ్యాహ్నం సమయం...
ముంబైలోని బంగూర్ నగర్...
ఓ ఇంట్లో యువతి ఆత్మహత్య...
సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతున్న యువతి...
ఉరేసుకుందని డిసైడైన స్థానికులు...
వాయిస్ ఓవర్ 6 :
ఏప్రిల్ ఒకటోతేదీ మధ్యాహ్నం సమయం. మరోవైపు.. ముంబైలోని బంగూర్ నగర్ కాలనీ అంతటా కలకలం చెలరేగింది. బంగూర్నగర్లోని ఓ ఇంట్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. సీలింగ్ ఫ్యాన్కు వేలాడటం చూసి వచ్చినవాళ్లు భయంతో వణికిపోతున్నారు. అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని నిర్ధారించుకున్నారు.
స్పాట్...
వయసు 24 యేళ్లుంటుంది...
అందరూ వచ్చేసరికే ఉరికి వేలాడుతోంది...
ఇరుగు పొరుగు వాసులకు గొడవలు గుర్తుకు వచ్చాయి...
ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు
కన్నీళ్లు పెట్టుకున్నారు
వాయిస్ ఓవర్ 7 :
అమ్మాయి వయసు 24 యేళ్లుంటుంది. చుట్టుపక్కల వాళ్లు అందరూ వచ్చేసరికే ఉరికి వేలాడుతోంది. ఈ దృశ్యం చూడగానే.. కొద్దిరోజులుగా ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఇరుగు పొరుగు వాసులకు గుర్తుకు వచ్చాయి. కానీ. .ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఇంత చిన్నవయసులోనే నూరేళ్లు నిండాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
స్పాట్...
కొంతసేపటికి ముందు ఆ ఇంట్లోనుంచి బయటికెళ్లిన యువకుడు
తిరిగొచ్చాక చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు
లోపలినుంచి గడియపెట్టుకుందన్నాడు
తలుపు తెరవడం లేదని ఆదుర్దాగా చెప్పాడు
గడియ.. అందరూ వచ్చాక తెరుచుకుందా..?
వాళ్లంతా రాకముందే ఆ యువకుడే తెరిచాడా..?
వాయిస్ ఓవర్ 8 :
ఈ సీన్ జరగడానికి కొంతసేపటిముందు ఆ ఇంట్లోనుంచి ఓ యువకుడు బయటికి వెళ్లాడు. కాసేపయ్యాక తిరిగొచ్చాడు. చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచాడు. అమ్మాయి లోపలినుంచి గడియ పెట్టుకుందని చెప్పాడు. ఎంత పిలిచినా తలుపు తెరవడం లేదని ఆదుర్దాగా చెప్పాడు. మరి.. లోపలినుంచి గడియ.. వాళ్లంతా వచ్చాక తెరుచుకుందా.. లేక అతనొక్కడే తెరిచాడా అన్నది మాత్రం స్పష్టం కాలేదు.
స్పాట్...
అమ్మాయిని కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్లారు
కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు
అప్పటికే చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు
సిద్ధార్థ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం
వాయిస్ ఓవర్ 9 :
అందరూ కలిసి లోపలికెళ్లి చూస్తే ఎదురుగా డెడ్బాడీ.. ఫ్యాన్కు వేలాడుతూ అమ్మాయి. హుటాహుటిన అమ్మాయిని కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. ఆ ఏరియాలోనే ప్రముఖమైన కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు. కానీ.. అప్పటికే ఆ యువతి చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఆస్పత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు.
స్పాట్...
అమ్మాయిది సొంతిళ్లు
కుటుంబసభ్యులు వేరేచోట ఉంటారు
అమ్మాయికి ఇంకా పెళ్లికాలేదు
అంత సంపన్నురాలా..?
యువతి ఒక్కర్తే ఇంట్లో ఉంటుందా..?
ఇంట్లోనుంచి బయటి కెళ్లిన యువకుడెవరు..?
కాసేపటికే ఎందుకు తిరిగొచ్చాడు..?
వాయిస్ ఓవర్ 10 :
అమ్మాయి చనిపోయిన ఇల్లు ఆమె సొంతిల్లు. కుటుంబసభ్యులందరూ వేరేచోట ఉంటారు. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. మరి.. ఈ వయసులోనే ఆ అమ్మాయికి సొంతిల్లు కొనుక్కునేంత ఆదాయం ఉందా..? అంత సంపన్నురాలా..? కుటుంబ సభ్యులంతా వేరేచోట ఉంటున్నారంటే.. ఆ యువతి ఒక్కర్తే ఆ ఇంట్లో ఉంటుందా..? మరి.. పెళ్లికాని ఆ యువతి ఇంట్లో నుంచి మధ్యాహ్నం వేళ బయటికెళ్లిన యువకుడెవరు..? ఆ తర్వాత కాసేపటికే అతను ఎందుకు తిరిగొచ్చాడు..? అన్నీ జవాబు లేని ప్రశ్నలే... ఇవన్నీ చిక్కుముడులే...
స్పాట్...
యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగానే కనిపించకుండా పోయాడు
సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు
వాయిస్ ఓవర్ 11 :
ఆ యువతి చనిపోయిన తర్వాత కాసేపు అక్కడే తచ్చాడిన యువకుడు.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగానే కనిపించకుండా పోయాడు. కొద్దిరోజుల దాకా అదృశ్యమయ్యాడు. సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
స్పాట్...
యువకుడికీ, అమ్మాయికీ సంబంధమేంటి..?
కొద్దిరోజుల దాకా పరారీలో ఎందుకున్నాడు..?
నిజంగా అమ్మాయిది ఆత్మహత్యేనా..?
అందుకు ప్రేరేపించింది ఎవరు..?
ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి.?
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా..?
వాయిస్ ఓవర్ 12 :
అమ్మాయి చనిపోయిన విషయం మొదట గుర్తించింది ఆ యువకుడే అయితే.. అతనికీ ఆమెకూ ఉన్న సంబంధమేంటి..? యువతి మరణం తర్వాత కొద్దిరోజులు ఎందుకు పరారీలో ఉన్నాడు..? అసలు ఆమె మృతికి. ఇతనికీ సంబంధముందా..? నిజంగా ఆ అమ్మాయిది ఆత్మహత్యేనా.. ఆత్మహత్యే అయితే అందుకు ప్రేరేపించింది ఎవరు..? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి.? లేదంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా..? ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలుగా మిగిలాయి.
స్పాట్....
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ఫేం.. ప్రత్యూష బెనర్జీ.
యువకుడు నిర్మాత రాహుల్రాజ్ సింగ్.
ఇద్దరూ లవర్స్.. కలిసి సహజీవనం కూడా చేశారు
వాయిస్ ఓవర్ 13 :
చనిపోయిన యువతి.. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ఫేం.. ప్రత్యూష బెనర్జీ. ఇప్పటిదాకా చెప్పుకున్న ఆ యువకుడు నిర్మాత రాహుల్రాజ్ సింగ్. ఇద్దరూ స్నేహితులు. కాదు.. కాదు.. లవర్స్.. అంతేకాదు.. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు.
స్పాట్...
హిందీలో 'బాలికా వధు'..తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'
దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు
చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ అంటే.. ఫ్యాన్స్ చెవి కోసుకుంటారు
నటనతో సీరియల్కే కలరింగ్ను తెచ్చిపెట్టిన ప్రత్యూష
అనేక సీరియళ్లలోనూ తనదైన నటనాశైలి
వాయిస్ ఓవర్ 14 :
హిందీలో 'బాలికా వధు' పేరుతో, తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా అనువాదమై ప్రసారమైన ఈ సీరియల్కు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఇక.. ఆ సీరియల్ ప్రధాన పాత్రధారి అయిన చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ అంటే.. ఫ్యాన్స్ చెవి కోసుకుంటారు కూడా. తన నటనతో మొత్తం సీరియల్కే కలరింగ్ను తెచ్చిపెట్టింది. అత్యద్భుతమైన నటనతో, అమాయకపు ఫోజులతో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.చిన్నవయసులోనే.. అద్భుతమైన అభిమానాన్ని చూరగొంది. ఇదొక్కటే కాదు.. అనేక సీరియళ్లలోనూ తనదైన నటనాశైలిని కనబర్చింది. అతిచిన్న వయసులోనే.. నటనారంగంలోకి ప్రవేశించిన అతికొద్ది కాలంలోనే పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది ప్రత్యూష బెనర్జీ. కానీ 24యేళ్ల వయసులోనే ఈలోకం విడిచి వెళ్లిపోయింది.
స్పాట్...
======================================
Chinnari Pellikuturi TWO - pkg (నేపథ్యం, సీరియల్స్)
========================
చిన్నారి పెళ్లి కూతురుగా సుపరిచితురాలైన ప్రత్యూష.. ఆ తర్వాత కెరీర్లో దూసుకుపోయింది. సీరియళ్లే కాదు.. రియాల్టీ షోలలోనూ పాల్గొంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక ఆదరణ సంపాదించింది.
మరుసటిరోజు ప్రత్యూషబెనర్జీ మృతదేహానికి అంత్యక్రియలు
అత్తారింటికి పంపేందుకు సిద్ధమవుతున్న కుటుంబసభ్యులు...
దు:ఖసాగరం మధ్య ప్రత్యూషను స్మశానానికి సాగనంపారు
పెళ్లి దుస్తులు డిజైన్ చేయాలంటూ డిజైనర్ రోహిత్ వర్మకు చెప్పిన ప్రత్యూష
ఆ విషయాన్ని తలచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చిన స్నేహితుడు
వాయిస్ ఓవర్ 1 :
తన ఇంట్లోనే ఉరేసుకున్న స్థితిలో కనిపించిన ప్రత్యూష బెనర్జీ మృతదేహానికి మరుసటిరోజు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యుల రోదనలు, అయిన వాళ్ల కన్నీటి మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యూష అంత్యక్రియల తంతు పూర్తయ్యింది. త్వరలోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేందుకు సిద్ధమవుతున్న కుటుంబసభ్యులు.. ప్రత్యూషను దు:ఖ సాగరం మధ్య స్మశానానికి సాగనంపారు. అంతేకాదు.. తొందర్లోనే తనకు పెళ్లి దుస్తులు డిజైన్ చేయాల్సి ఉంటుందని తన స్నేహితుడైన డిజైనర్ రోహిత్ వర్మకు చెప్పింది ప్రత్యూష. ఆమెను చివరి చూపులు చూసేందుకు వచ్చిన రోహిత్ వర్మ ఈ విషయాన్ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్వడం అక్కడున్న వాళ్లను కలచివేసింది.
స్పాట్...
ఆత్మహత్య కాదన్న కుటుంబసభ్యులు
ప్రియుడిపై అనుమానాలు
వాయిస్ ఓవర్ 2 :
ప్రత్యూష కళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. నుదుటి మీద తాజా సింధూరం కనిపిస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు కుటుంబసభ్యులు. అదృశ్యమైన ప్రియుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మరణానికి రాహులే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
స్పాట్...
ఆనంది పాత్రలో ప్రత్యూష బెనర్జీ
మొదట చిన్నారి పెళ్లికూతురు పాత్రలో అవికాగోర్
2013లో ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష బెనర్జీ
వాయిస్ ఓవర్ 3 :
చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో ఆనంది పాత్ర ద్వారా ప్రత్యూష బెనర్జీ మహిళల అభిమానాన్ని చూరగొంది. ఈ సీరియల్లో చిన్నారి పెళ్లికూతురు పాత్రలో మొదట అవికాగోర్ నటించింది. అవికాగోర్కు టాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు రావడంతో.. 2013లో ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. దీంతో.. ప్రత్యూష బెనర్జీ చిన్నారి పెళ్లికూతురిగా ఎంట్రీ ఇచ్చింది.
స్పాట్...
చిన్నారి పెళ్లికూతురుకు మరింత కళ
దేశవ్యాప్తంగా అభిమానులు
వాయిస్ ఓవర్ 4 :
ప్రత్యూష బెనర్జీ ఎంటరయ్యాక.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్కు మరింత కళ వచ్చింది. తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్లో నటనతో ఆకట్టుకున్న ప్రత్యూష.. తర్వాత మరికొన్ని సీరియల్స్లోనూ వివిధ పాత్రలు పోషించింది.
స్పాట్...
హిందీలో 'బాలికావధు'.. తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'
'ససురాల్ సిమర్కా' వంటి ఉత్తరాది సీరియల్స్
బిగ్బాస్ - 7, ఝలక్ దిఖ్ లాజా - 5...
కామెడీ క్లాసెస్ వంటి రియాల్టీ షోల్లో పాల్గొంది
వాయిస్ ఓవర్ 5 :
హిందీలో నిర్మించిన బాలికా వధు సీరియల్నే తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగా అనువాదం చేసి ప్రసారం చేశారు. అందులో హీరోయిన్ పాత్రను పోషించింది ప్రత్యూష బెనర్జీ. ససురాల్ సిమర్కాతో పాటు మరికొన్ని ఉత్తరాది టీవీ సీరియల్స్లోనూ నటించింది. బిగ్బాస్ - 7, ఝలక్ దిఖ్ లాజా - 5, కామెడీ క్లాసెస్ వంటి రియాల్టీ షోల్లోనూ ప్రత్యూష పాల్గొంది. అయినా.. అటు ఉత్తరాదిలో 'బాలికా వధుగా' ఇటు. .తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగానే టెలివిజన్ ప్రేక్షకులు ఆమెను ఆదరించారు.
స్పాట్...
కుటుంబ సభ్యుల్లోనే కాదు.. అభిమానుల్లోనూ విషాదం
వాయిస్ ఓవర్ 6 :
నటనారంగంలోకి ప్రవేశించిన అతితక్కువ కాలంలోనే పేరున్న సీరియల్స్లో నటించి, ప్రేక్షకుల మెప్పును పొందిన ప్రత్యూష బెనర్జీ మృతి ఇటు.. కుటుంబసభ్యులు, బంధువుల్లోనే కాదు.. అటు.. అభిమానుల్లోనూ విషాదం నింపింది.
స్పాట్...
మిస్టరీగా మారిన ప్రత్యూష మరణం
రకరకాల ఊహాగానాలు
షికార్లు చేసిన పుకార్లు
వారం రోజుల తర్వాత ప్రియుడు రాహుల్ అరెస్టు
వాయిస్ ఓవర్ 7 :
మరోవైపు.. ప్రత్యూష మరణం మిస్టరీగా మారింది. ప్రత్యూష చనిపోయిన రోజు ఆమెతో పాటే ఉన్న ప్రియుడు రాహుల్ రాజ్సింగ్ కనిపించకుండా పోవడంతో కొద్దిరోజులు కేసు ముందుకు సాగలేదు. మృతిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనేక పుకార్లు, వాదనలు షికారు చేశాయి. వారం రోజుల తర్వాత పోలీసులు ప్రత్యూష ప్రియుడు రాహుల్ను అరెస్టు చేశారు. ప్రత్యూషతో అతనికున్న అనుబంధం, చనిపోయే ముందు ఆమె మానసిక స్థితి, అసలు ఆమెది ఆత్మహత్యా..? హత్యా..? అన్న కోణాన్నీ విశ్లేషించే ప్రయత్నం చేశారు.
స్పాట్...
==========================================
Chinnari Pellikuturi Three - pkg
========================
యాంకర్ :
ప్రత్యూష బెనర్జీ మరణం వెనుక మిస్టరీ ఏంటి..? పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్పింది..? ప్రత్యూష ప్రియుడు పోలీసుల విచారణలో వెల్లడించిన అంశాలేంటి..? పోలీసులు దర్యాప్తులో ఏం తేల్చారు..? ప్రత్యూష బెనర్జీ కుటుంబసభ్యుల డిమాండ్ ఏంటి..? అసలు ఈ మరణం వెనుక ఏం జరిగింది.
రాహుల్ రాజ్సింగ్పై పలు సెక్షన్ల కింద కేసులు
14 గంటల పాటు రాహుల్పై ప్రశ్నల వర్షం
వాయిస్ ఓవర్ 1 :
సంచలనం సృష్టించిన ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్సింగ్పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 306, 505, 506 తదితర అభియోగాలతో కేసు నమోదు చేశారు. రాహుల్ను అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో ప్రశ్నించారు. ఏకధాటిగా 14 గంటల పాటు ప్రశ్నించి వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
స్పాట్...
దర్యాప్తు సమయంలోనే అనేక ఊహాగానాలు
చనిపోయేముందు ప్రియుడితో వాట్సాప్లో చాటింగ్
వాయిస్ ఓవర్ 2 :
ఓవైపు పోలీసుల దర్యాప్తు సాగుతున్న సమయంలోనే అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. చనిపోయేముందు ప్రత్యూష..తన ప్రియుడికి పుంఖాను పుంఖాలుగా వాట్సాప్ మెస్సేజ్లు పంపించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. చివరి ఫోన్కాల్ అతనికే చేసిందన్న విషయమూ నిర్ధారణ అయ్యింది.
స్పాట్...
బాయ్ఫ్రెండ్తో కలిసి మలాంద్లోని కార్నివాల్ మాల్కు ప్రత్యూష
రాహుల్ కొట్టడంతో కిందపడిపోయిన ప్రత్యూష
ఆరోజే ప్రత్యూష చనిపోయింది
వాయిస్ ఓవర్ 3 :
మరోవైపు.. ఆత్మహత్యకు ముందు.. ప్రత్యూష బెనర్జీ తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ తో కలిసి, మలాంద్లోని కార్నివాల్ మాల్ కు వెళ్లిందని, అక్కడే వాళ్లిద్దరికీ పెద్ద గొడవైందన్న ప్రచారం జరిగింది. ఈ గొడవలో రాహుల్.. ఆమెను గట్టిగా కొట్టాడని, కిందపడిన ఆమెను లేవదీసే ప్రయత్నం కూడా చేయలేదని, ఇది జరిగిన రోజే ఆమె చనిపోయిందని చెప్పుకున్నారు.
స్పాట్...
ప్రియుడితో ప్రత్యూషకు సమస్యలు
ప్రత్యూష ఫోన్తోనే పరారైన రాహుల్
వాయిస్ ఓవర్ 4 :
ఇక.. ప్రత్యూషను హాస్పిటల్కు తీసుకెళ్లాక.. రాహుల్ ప్రశాంతంగా చిప్స్ తింటూ గడిపాడని, అతనిలో టెన్షన్గానీ, బాధగానీ కనిపించలేదని ఆమె కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. చనిపోయే ముందు కొద్ది రోజులుగా ఆమె రాహుల్ రాజ్ సింగ్ తో సమస్యలు ఎదుర్కొంటోందని ఆమె సన్నిహితులు వాపోయారు. ఇక.. రాహుల్ పరారయ్యే ముందు ప్రత్యూష ఫోన్ కూడా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై ఆరోపణలు, అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.
స్పాట్...
ముందస్తు బెయిల్కోసం రాహుల్ ప్రయత్నాలు
బెయిల్ రద్దు చేయాలంటూ ప్రత్యూష తల్లి పిటిషన్
మహారాష్ట్ర సీఎంకు ప్రత్యూష తల్లి లేఖ
వాయిస్ ఓవర్ 5 :
పోలీసు కేసులు, ప్రశ్నల నేపథ్యంలో ముందస్తు బెయిల్ పొందేందుకు రాహుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ముంబైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేశాక.. దాన్ని రద్దు చేయాలంటూ అటు.. ప్రత్యూష తల్లి కూడా కోర్టును ఆశ్రయించింది. తమ కూతుర్ని చంపేసిన రాహుల్కి ముందస్తు బెయిలు ఇవ్వొద్దని వాదించింది. ఆ తర్వాత పోలీసులు రాహుల్ను అరెస్టు చేయడం, తర్వాత బెయిల్పై విడదల కావడం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత.. తమ కూతురి మృతి కేసులో నిందితుడైన ఆమె ప్రియుడు రాహుల్ తమను బెదిరిస్తున్నాడంటూ ప్రత్యూష తల్లి సోమా ముఖర్జీ ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
స్పాట్...
ప్రత్యూష చివరి ఫోన్కాల్ రికార్డింగ్ విన్న న్యాయస్థానం
'నన్ను క్యారెక్టర్ లేని దానిగా ముద్ర వేశారు...
నాకు జీవితంలో ఇంకేం మిగిలింది..? అని ప్రశ్నించిన ప్రత్యూష
వాయిస్ ఓవర్ 6 :
మరోవైపు.. ప్రత్యూష చివరి ఫోన్కాల్ రికార్డింగ్స్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆ ఫోన్.. ప్రియుడు రాహుల్రాజ్సింగ్కే చేసినట్లు నిర్ధారించారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోను న్యాయస్థానం విన్నది. తనను క్యారెక్టర్ లేని దానిగా ముద్రవేశారని, తనకు జీవితంలో ఇంకేం మిగిలిందని ప్రశ్నించింది ప్రత్యూష. అయితే.. ప్రత్యూష మాట్లాడుతుండగానే రాహుల్ ఫోన్ కట్ చేశాడని న్యాయస్థానం గుర్తించింది.
స్పాట్...
గతంలోనూ ప్రత్యూష ఆత్మహత్యాయత్నం
వాయిస్ఓవర్ 7 :
ఈ క్రమంలోనే మరో వాదన కూడా తోడైంది. ప్రత్యూష ఇలా ఎక్సట్రీమ్ స్టెప్ తీసుకోవటం తొలిసారి కాదని, గతంలో మాజీ బాయ్ ఫ్రెండ్తో విడిపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసిందని, అప్పుడు అదృష్టవశాత్తూ బతికిపోయిందని ఆమె స్నేహితులు తెలిపారు.
స్పాట్...
రెండుసార్లు సూసైడ్కు ప్రయత్నించిన ప్రత్యూష
ఓసారి విషం తాగింది...
మరోసారి బాల్కనీనుంచి దూకేందుకు ప్రయత్నించింది
వాయిస్ ఓవర్ 8 :
ప్రత్యూష గతంలోనూ రెండు సార్లు సూసైడ్కు ప్రయత్నించిందని ఆమె స్నేహితురాలు సారా ఖాన్ చెప్పింది. ఓసారి విషం తాగి చనిపోయేందుకు ప్రయత్నించిందని తెలిపింది. మరోసారి ఓ ఫంక్షన్కు వెళ్లినప్పుడు బాల్కనీ నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించిందని చెప్పింది. ఆ రెండు సందర్భాల్లో తానే కాపాడినట్లు కూడా సారా ఖాన్ వెల్లడించింది. చివరకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరు పెట్టుకుంది.
స్పాట్...
ప్రత్యూష కేసులో కొత్త ట్విస్ట్
చనిపోయేముందు మద్యం మత్తులో ప్రత్యూష
వాయిస్ఓవర్ 9 :
దర్యాప్తు సాగుతున్న కొద్దీ ప్రత్యూష కేసులో కొత్త ట్విస్ట్ బయట పడింది. చనిపోయే ముందు ప్రత్యూష మద్యం సేవించిందని తేలింది.
స్పాట్...
==========================================
R Alert Chinnari Pellikuturi Four - pkg
========================
ప్రత్యూష చనిపోయేముందు మద్యం తాగిందన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పైగా.. ప్రత్యూష రెండు నెలల గర్భవతి.. అంతేకాదు.. అబార్షన్ కూడా చేయించుకుంది. ప్రత్యూషకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు విస్తుగొలిపాయి.
బయటపడుతోన్న కొత్త అంశాలు
మోతాదుకు మించి తాగిందంటున్న మెడికల్ రిపోర్టు
గర్భవతి, అబార్షన్ కూడా చేయించుకుంది
వాయిస్ ఓవర్ 1 :
ప్రత్యూష కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ కొత్త కొత్త అంశాలు బయటపడ్డాయి. ప్రత్యూష చనిపోయేముందు విపరీతంగా మద్యం సేవించిందని తేలింది. 135 ఎంజీ ఆల్కాహాల్ తీసుకుందని మెడికల్రిపోర్టులో తేలినట్లు చెబుతున్నారు. ఇది యావరేజ్ కంటే చాలా ఎక్కువ అని అంటున్నారు. అంతేకాదు.. అమె గర్భవతి అని, అబార్షన్ కూడా చేయించుకుందన్న విషయం తెలిసి కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. తమ కూతురి చావుకు ఖచ్చితంగా ఆమె ప్రియుడే కారణమని తల్లిదండ్రులు వాదించారు.
స్పాట్..
ప్రత్యూష గర్భం దాల్చడం నిజమేనా..?
అబార్షన్ చేయించుకున్న విషయమూ వాస్తవమేనా..?
ఎందుకా నిర్ణయం తీసుకుంది..?
బంధాన్ని తెంచుకునేందుకే అబార్షన్ చేయించుకుందా..?
రాహుల్ ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడా..?
వాయిస్ ఓవర్ 2 :
పెళ్లికి ముందే ప్రత్యూష గర్భం దాల్చడం నిజమేనా..? అబార్షన్ చేయించుకున్న విషయమూ వాస్తవమేనా..? ఒకవేళ అదే నిజమైతే.. ఎందుకా నిర్ణయం తీసుకుంది..? రాహుల్తో గొడవల నేపథ్యంలో బంధాన్ని తెంచుకునేందుకే అబార్షన్ చేయించుకుందా..? లేదంటే రాహుల్ ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడా..? అన్న విషయాలూ మిస్టరీగా మారాయి.
ప్రత్యూష తాగుడుకు బానిసైందన్న రాహుల్
పరస్పర అంగీకారంతోనే అబార్షన్
వాయిస్ ఓవర్ 3 :
ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి సందేహాలను నివృత్తి చేశాడు. ఆమె తాగుడుకు బానిసైందని.. డ్రగ్స్, ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకోవడం అలవాటైందని, ఈ విషయం ఆమె స్నేహితులకు కూడా తెలుసని రాహుల్ పేర్కొన్నాడు. అంతేకాదు.. ప్రత్యూష గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించుకుందన్నాడు. పరస్పర అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకుందని కూడా చెప్పాడు. పోలీసుల విచారణలోనూ రాహుల్ ఇవే విషయాలు చెప్పి ఉంటాడని భావిస్తున్నారు.
స్పాట్...
ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు
పిచ్చాపాటీ ఉదయం దాకా కొనసాగింది
నిద్రలేచాక ప్రత్యూష మళ్లీ తాగుతూ కూర్చుందన్న రాహుల్
బయటికి వెళ్లివచ్చేసరికే దారుణం జరిగిపోయిందన్న రాహుల్
మందుకొట్టి మరీ తరచూ గొడవ పడేవాళ్లు
వాయిస్ ఓవర్ 4 :
ప్రత్యూష చనిపోయే ముందురోజు ఆమె ఇంట్లో తనతో పాటు.. మరో కామన్ ఫ్రెండ్ ముగ్గురం కలిసి పార్టీ చేసుకున్నామని, ఉదయం దాకా పిచ్చాపాటీ కొనసాగిందని రాహుల్ చెప్పాడు. తాను నిద్రలేచే సరికి ప్రత్యూష మళ్లీ తాగుతూనే కూర్చుందని, దీంతో ఇద్దరి మధ్యా చిన్న గొడవ జరిగిందన్నాడు. తినడానికి ఏమైనా తేవడానికి బయటికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగిపోయిందని బాధపడ్డాడు రాహుల్ రాజ్ సింగ్. అయితే.. వీరి అపార్ట్ మెంట్లలోని ఇరుగుపొరుగు వాళ్ళు కూడా ప్రత్యూష బెనర్జీ, రాహుల్ లు మందుకొట్టి మరీ తరచూ గొడవ పడేవారని చెబుతున్నారు. అంటే.. చనిపోయేముందు కొద్దిరోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు తీవ్రరూపం దాల్చాయన్నది మాత్రం వాస్తవమేనని తేలింది.
స్పాట్...
ప్రత్యూష కేసులో మరో ట్విస్ట్
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది
డబ్బు తల్లి అకౌంట్లో డిపాజిట్ చేసిందన్న రాహుల్
రాహులే డబ్బు డ్రా చేశాడన్న తల్లి
ప్రత్యూష అకౌంట్ నుంచి రాహుల్ ఖాతాలోకి రూ.24 లక్షలు
వాయిస్ఓవర్ 5 :
వీటికి తోడు.. ఈకేసులో మరో ట్విస్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవని, ప్రముఖ బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని తీవ్ర ఒత్తిడికి గురైందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె డబ్బంతా వాళ్ల అమ్మ అకౌంటులో డిపాజిట్ చేసేదని ప్రత్యూష బెనర్జీ ప్రియుడు రాహుల్ రాజ్ ఆరోపించాడు. మరోవైపు.. ప్రియాంక అకౌంట్ నుంచి ఆమె ప్రియుడు రాహులే డబ్బు డ్రా చేశాడని ప్రియాంక తల్లి కోర్టులో వాదించింది. అయితే.. ప్రత్యూష బ్యాంక్ అకౌంట్ నుంచి రాహుల్ ఖాతాలోకి 24 లక్షల రూపాయలు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
స్పాట్...
రాహుల్ రాజ్సింగ్వైపే అనుమానపు చూపులు
వాయిస్ ఓవర్ 6 :
ఇక.. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని, ఇది ఖచ్చితంగా హత్యే అని కుటుంబసభ్యులు వాదిస్తూనే ఉన్నారు. అయితే అందరూ ప్రత్యూష మృతి విషయంలో ఆమె ప్రేమికుడు రాహుల్ రాజ్ సింగ్ వైపు అనుమానంగా చూస్తున్నారు.
స్పాట్...
====================
End Anchor
-------------
తల్లిదండ్రుల అనుమానాలు, ప్రియుడి ప్రతివాదనల మధ్య... సాగుతున్న ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు బయటపడతాయో చూడాలి.
===================
19, ఆగస్టు 2016, శుక్రవారం
అనాథాశ్రమం పేరిట చిన్నారులతో భిక్షాటన
చిన్నారులను ఆదరిస్తామనేది ముసుగు మాత్రమే... అనాథ శరణాలయం అనేది కేవలం బోర్డుకే పరిమితం. చిల్లర వేషాలతో చెలరేగిపోతున్న ముష్టియా. మన కళ్లు మనల్నే మోసం చేసేలా.. నయవంచక నాటకాలతో చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న కంత్రీగాడి స్టోరీ.
సమాజాన్ని ఉద్ధరిస్తామంటారు...
సేవ చేస్తున్నామంటూ ఊదరగొడతారు...
అరచేతిలో స్వర్గం చూపిస్తారు...
తెర వెనుక వేరే తతంగం నడిపిస్తారు...
సమాజాన్ని ఉద్ధరిస్తామంటూ కొందరు బయల్దేరతారు. సమాజం కోసమే సేవ చేస్తున్నామంటూ ప్రచారంతో ఊదరగొడతారు. ఎదుటివాళ్లకు తాము చేస్తున్న ఘనకార్యాన్ని చెబుతూ అరచేతిలో స్వర్గం చూపిస్తారు. కానీ.. తెర వెనుక వేరే తతంగం నడిపిస్తారు.
సర్వసాధారణమైన వ్యవహారాలు
అవసరాలు, పరిస్థితులను బేరీజు వేసుకొని రంగంలోకి దిగుతారు
కొంత కాలంగా ఇలాంటి వ్యవహారాలు సర్వ సాధారణమైపోయాయి. సమాజం అవసరాలను, గ్రామాల స్థాయిలో పరిస్థితులను, పేదలు, అనాథలు, అమాయకుల అవసరాలను బేరీజు వేసుకుంటూ రంగంలోకి దిగుతారు.
అనాథలు, వృద్ధుల ఆశ్రమాలు చైల్డ్ వెల్ఫేర్ హోమ్లంటారు
నిబంధనలు తెలియవు
మార్గదర్శకాలతో వాళ్లకు పనిలేదు
పిల్లలనే అస్త్రాలుగా వాడుకుంటారు
అనాథలు, వృద్ధుల ఆశ్రమాలంటూ.. చైల్డ్ వెల్ఫేర్ హోమ్లంటూ కలరింగ్ ఇస్తారు. ఎవరి దృష్టీ పడని ప్రాంతాలు ఎంచుకొని బోర్డులు పెడతారు. అసలు నిబంధనలంటే వాళ్లకు తెలియవు. ఇలాంటి కేంద్రాలు ఎలా నిర్వహించాలో మార్గదర్శకాలతో పనిలేదు. వాటి పేరు చెప్పుకొని తమ పబ్బం గడుపుకుంటారు. చైల్డ్ హోమ్ల నిర్వాహకులు.. పిల్లలనే అస్త్రాలుగా వాడుకుంటారు. వెలుగులోకి వస్తే తప్ప.. ఎవరికీ కనిపించని ఓ మాఫియా తరహా వ్యవహారమిది.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్లో చిన్నారుల భిక్షాటన
కనిపించిన వారినల్లా డబ్బులడుగుతున్నారు
హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ జంక్షన్లో నలుగురు చిన్నారులను గుర్తించారు పోలీసులు. ఇద్దరు బాలురు, మరో ఇద్దరు బాలికలు భిక్షాటన చేస్తున్నారు. చేతిలో హుండీలు పట్టుకొని కనిపించిన వారినల్లా డబ్బులడుగుతున్నారు. అంత చిన్న వయసులో వీళ్లకు ఇదేం పరిస్థితి అని చలించిపోయారు. దగ్గరికెళ్లి వాళ్ల గురించి వివరాలు ఆరా తీశారు.
అనాథాశ్రమానికి చెందినవాళ్లమన్నారు
భిక్షాటన చేయాలని ఆశ్రమ నిర్వాహకుడి ఆదేశం
తాము ఓ అనాథాశ్రమానికి చెందిన వాళ్లమని చెప్పారా చిన్నారులు. తమ ఆశ్రమం నిర్వాహకుడి ఆదేశాల మేరకు ఇక్కడ భిక్షాటన చేస్తున్నామని చెప్పారు. దీంతో.. తీగలాగిన పోలీసులు డొంకంతా కదిలించారు.
హైదరాబాద్లో రోజూ చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
భిక్షాటన అనేది సామాన్యమైన విషయం కాదు. హైదరాబాద్లో కేవలం భిక్షాటనపైనే రోజూ కోట్ల రూపాయలు చేతులు మారతాయన్న విషయం తెలిసిందే. దాన్ని ఆసరాగా తీసుకున్న ఆశ్రమ నిర్వాహకుడు చిన్నారులనే పావులుగా వాడుకున్నాడు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాలు ముదిరితే మాఫియా అనడం పరిపాటి.. మరి భిక్షాటనకూ ఓ సినిమాలో ఒక పేరు పెట్టారు.
చైల్డ్లైన్ అధికారులకు సమాచారం
బ్రహ్మపుత్ర అనాధాశ్రమంలో తనిఖీలు
నిర్వాహకుడు ఖమ్మం జిల్లా వాసి జేమ్స్
భిక్షాటన చేస్తున్న చిన్నారులిచ్చిన వివరాలతో చైల్డ్లైన్ అధికారులకు సమాచారమిచ్చారు పోలీసులు. మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం అమీన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రహ్మపుత్ర అనాథాశ్రమంలో తనిఖీలు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన జేమ్స్ అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న 19మంది చిన్నారులను రెస్క్యూహోమ్కు తరలించారు.
ప్రభుత్వ అనుమతి లేకుండానే జేమ్స్ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చైల్డ్లైన్ అధికారులు తెలిపారు. చిన్నారులను పాఠశాలకు పంపకుండా వారితో భిక్షాటన చేయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. జేమ్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. బ్రహ్మపుత్ర అనాథాశ్రమం పేరిట ఇలాంటి తతంగం చాలా రోజుల నుంచి జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
13, ఆగస్టు 2016, శనివారం
గ్యాంగ్స్టర్ నయీం డాక్యుమెంటరీ (రెడ్ అలర్ట్)
nayeem ONE
-------------
నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే రాజకీయ నాయకులు హడలెత్తిపోతారు. హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకే ఉండదు. అలాంటి నయీమ్ నేర చరిత్రపై రెడ్ అలర్ట్ స్పెషల్ డాక్యుమెంటరీ...
voice over
---------
నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రం.... గ్యాంగ్స్టర్ నయీం పుట్టింది ఇక్కడే... కానీ.. అతని బాల్యం, విద్యాభ్యాసం, పెరిగింది.. అంతా ఇదే జిల్లాలోని భువనగిరి.
స్పాట్...(భువనగిరి వ్యూషాట్స్ వేసుకోండి.)
నయీం తండ్రి ఖాజా నసీరుద్దీన్ అప్పటి ఏపీఎస్ఈబీ.. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డ్రైవర్. అందుకే.. అతని ఉద్యోగ రీత్యా కుటుంబం కనగల్ నుంచి భువనగిరికి మారింది. అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుందీ కుటుంబం. నయీం తల్లి తాహెరాబేగం. అతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
స్పాట్...
కనగల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో నయీం జన్మించాడు. భువనగిరికి మకాం మార్చిన సమయంలో నయీం బుడి బుడి అడుగులు వేస్తున్న వయసులో ఉన్నాడు. ఇక.. బాల్యమంతా అక్కడే గడిచింది. భువనగిరిలోనే చదివాడు. పరిసరాల్లో ఆడుకున్నాడు. చెట్టూ, పుట్టా తిరిగాడు. తన ఏజ్ వాళ్లతో కలిసి ఆడి పాడాడు. కాలేజీ చదువు కూడా అక్కడే సాగింది.
స్పాట్...
1991లో ఇంటర్మీడియట్ చదివాడు నయీం. కాలేజీలో చేరినప్పటినుంచే నయీం వ్యక్తిత్వంలో మార్పు కనిపించింది. ఆలోచనల్లో విభిన్నత గోచరించింది. తోటివాళ్లకు, నయీంకు మధ్య తేడా స్పష్టంగా ఉండటాన్ని అప్పటి పెద్దలు గమనించారు.
స్పాట్...
నయీం మరోకోణం చిన్నప్పుడు అతనితో కలిసి తిరిగిన వాళ్లకే తెలుసు. అతనిది విచిత్ర మనస్తత్వమని.. వాటి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకోవడం కొందరికి ఒళ్లు జలదరించేలా చేస్తుంది.
స్పాట్...
పాములు, తేళ్లతో ఆడుకునే వాడు నయీం... అతని రాక్షస మనస్తత్వానికి ఇదో మచ్చు తునక. అసలు వాటిని చూస్తేనే భయపడి ఆమడదూరం పరుగెత్తే వయసులోనే.. వాటిని పట్టుకొని ఆడుకోవడం చూస్తే అతనిలోని తెగింపు అర్థం చేసుకోవచ్చు.
స్పాట్...
విద్యార్థి దశలోనే సీపీఎం అనుబంధం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా- SFI లో పనిచేశాడు నయీం. ఆ తర్వాత పీపుల్స్వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ - RSU లో చేరాడు. ఆర్ఎస్యూలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఆ సమయంలోనే ప్రత్యేకంగా ఓ గ్రూప్ను మెయింటెయిన్ చేశాడు. అనుచరులను వెంటేసుకొని తిరిగాడు. అప్పుడే పీపుల్స్వార్ సిద్ధాంతాలకు, కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యాడు నయీం.
స్పాట్...
అది 1991వ సంవత్సరం. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే పీపుల్స్వార్తో అనుబంధాలు పెంచుకొన్నాడు నయీమొద్దీన్. అంతేకాదు.. ఓ తపంచాను కూడా సమీకరించుకున్నాడు. దాన్ని చూపించి భువనగిరిలోని కొందరు వ్యాపారవేత్తలను బెదిరించాడు. దీంతో.. వ్యాపారులు పోలీసుల శరణుజొచ్చారు. అప్పటికే ఓ గ్యాంగ్ను మెయింటెయిన్ చేస్తున్న నయీంతోపాటు.. అతని అనుచరులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. అంటే.. ఇంటర్ చదువుతున్నప్పుడే పోలీసులతో తొలివైరం మొదలైంది.
స్పాట్...
అదే యేడాది... నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో కలకలం. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఆసమయంలో గుట్టపైనే నయీం అరెస్టయ్యాడు. నాటు తుపాకీతో పాటు గ్రెనేడ్తో హల్చల్ సృష్టించి.. భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించాడు నయీం,. అంతేకాదు.. బ్రహ్మోత్సవ విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడికి ప్రయత్నించాడు. దీంతో.. అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్పాట్...
ఆర్ఎస్యూలో పనిచేసిన అనుభవంతో.. ఆ భావాలతో పెరిగిన నయీం.. అప్పటికే పీపుల్స్వార్తో సంబంధాలు పెంచుకున్నాడు. యాదగిరి గుట్ట కేసులో అరెస్ట్ అయి.. చంచల్గూడ జైలులో ఉన్నప్పుడే పీపుల్స్వార్ నేత శాఖమూరి అప్పారావుతో అనుబంధం పెంచుకున్నాడు. సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేశాడు. వారికి సన్నిహితుడిగా మెలిగి.. నమ్మిన బంటుగా మారాడు కూడా.
స్పాట్...
స్వతహాగా భిన్న ఆలోచనలతో సంచలనాలు సృష్టించడమంటే సరదా పడే.. నయీమొద్దీన్.. ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచించేవాడు. దాడులు, బెదిరింపులు, సెటిల్మెంట్లంటే ముందుండే వాడు. దీంతో.. పీపుల్స్ వార్లో కూడా నయీమ్కు ప్రత్యేక స్థానం లభించింది.
స్పాట్...
=================================================
=================================================
nayeem TWO
-------------
ఒక డీఐజీ స్థాయి పోలీసును టార్గెట్ చేయడమంటే మాటలు కాదు. అందుకు ఎంతో నేర్పు అవసరం. పలు సార్లు రెక్కీలు తప్పనిసరి. టార్గెట్ అయిన వ్యక్తి మూవ్మెంట్స్పై కన్నేయాలి. అప్టూ డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి. ఏ సమయంలో ఎక్కడెక్కడికెళ్తున్నాడన్న దినచర్యను గమనిస్తూ ఉండాలి. ఇంతటి క్లిష్టమైన పనిని నయీంకు అప్పగించింది పీపుల్స్వార్ గ్రూప్.
voice over
----------
స్పాట్...
అప్పటికే పీపుల్స్వార్లో ఎంతోమంది సీనియర్లున్నా.. రెండుమూడేళ్ల నుంచే తమతో సంబంధం ఉన్న... అప్పుడప్పుడే ఎదుగుతున్న నయీంనే ఈ పనికి ఎంచుకుంది పీపుల్ష్వార్.
స్పాట్..
గురిపెట్టానంటే తప్పదన్న పేరు ప్రతిష్టలు తనకే దక్కాలన్న ఉత్సుకతతో ఉండే నయీం.. కూడా సరేనంటూ తలూపాడు. పీపుల్స్వార్ నాయకత్వం తనకు అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు అంగీకరించాడు.
స్పాట్...
1993 జనవరి 27వ తేదీ ఉదయం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం. ఎందరో ప్రముఖులు, పోలీసు అధికారులు, సామాన్యులు కూడా మార్నింగ్ వాక్కు వచ్చారు. కాసేపట్లోనే కాల్పుల శబ్దం. స్టేడియం అంతా కలకలం. అంతా తేరుకునేలోగానే రక్తపు మడుగులో మూడు మృతదేహాలు. అందులో డీఐజీ వ్యాస్ డెడ్బాడీ. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు.
స్పాట్...
పోలీసు డిపార్ట్మెంట్లో గ్రేహౌండ్స్ విభాగానికి ఆద్యుడు డీఐజీ వ్యాస్. అలాంటి డీఐజీనే చంపిన నయీం.. ఆ తర్వాత కాలంలో గ్రేహౌండ్స్కే కావాల్సిన వ్యక్తిలా మారాడు. తర్వాత పరిణామాలు అలాంటి పరిస్థితులకు వీలు కల్పించాయి.
స్పాట్....
డీఐజీ వ్యాస్ను హత్య చేసిన తర్వాత నయీం పోలీసులకు లొంగిపోయాడు. షరా మామూలుగా పోలీసులు జైలుకు పంపించారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమోగానీ.. అప్పటినుంచి పీపుల్స్వార్కు, నయీంకు శత్రుత్వం పెరిగిపోయింది. అతి కొద్ది కాలానికే పీపుల్స్వార్కు దూరమయ్యాడు నయీం. వ్యాస్ కేసులో జైలులో ఉన్న సమయంలో నయీంకు, పీపుల్స్వార్ అగ్రనేతలకు మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతారు.
స్పాట్...
ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు నయీమొద్దీన్. తన పంథా మార్చుకున్నాడు. ఆలోచనలకు పదును పెట్టాడు. మొదట ఎవరైతే తనను ఆదరించారో వాళ్లే తన శత్రువులుగా చెప్పుకున్నాడు.
స్పాట్...
నక్సలైట్గా జీవితం ప్రారంభించిన నయీం.. ఆ తరవాత నక్సల్స్ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు. వాళ్లపైనే యుద్ధం ప్రకటించాడు. ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. నక్సలైట్లను సమూలంగా నిర్మూలిస్తానని శపథం చేశాడు. అందుకోసం ఏ పనైనా చేస్తానన్నాడు.
స్పాట్...
మావోయిస్టులపై పగబట్టినట్లు ప్రకటించుకుని కింగ్ కోబ్రాలను సృష్టించాడు. ఒక్క కింగ్కోబ్రాలే కాదు.. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సా కోబ్రాస్, క్రాంతిసేన పేరిట చెలరేగి పోయాడు.
స్పాట్...
నయీం లక్ష్యాలు, కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన పోలీసులు.. అతన్ని చేరదీశారు. తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారని కథలు కథలుగా చెప్పుకుంటారు. కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసుల చేతిలో ఆయుధంగా కూడా మారాడంటారు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారని సమాచారం. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు.
స్పాట్...
=================================================
=================================================
nayeem Three
-------------
ఓ సందర్భంలో నక్సల్స్ నుంచి ముప్పు ఉందన్న కారణంగా నయీమ్కు ప్రభుత్వమే భద్రత కూడా కల్పించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత భూ దందాలు, సెటిల్మెంట్ల కేసుల్లో నిండా మునిగిపోయాడు. మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.
voice over
----------
స్పాట్...
పోలీసుల నుంచి రహస్యంగా తోడ్పాటు అందడంతో.. నయీమొద్దీన్కు వేయి ఏనుగుల బలం వచ్చినట్లయ్యిందన్న వాదన ఉంది. పీపుల్స్వార్లో ఉన్నప్పుడు నయీం పాల్పడిన అరాచకాల కన్నా.. వాళ్లపై యుద్ధం ప్రకటించాక సృష్టించిన మారణహోమమే ఎక్కువ.
స్పాట్...
వ్యాస్ హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చాక.. చిన్నప్పటినుంచి తనకు అనుబంధం ఉన్న భువనగిరికి మకాం మార్చాడు నయీం.. కొంతకాలం అటు.. పీపుల్స్వార్తో, ఇటు పోలీసులతో సంబంధాలు కొనసాగించిన దిట్ట నయీం. అప్పటికే ఓ ధృఢమైన అభిప్రాయానికి వచ్చినందున.. పీపుల్స్వార్ కదలికలను, వాళ్ల అరాచక ప్లాన్లను ఎప్పటికప్పుడు తనకు అండగా ఉండే పోలీసులకు చేరవేశాడన్న ప్రచారం ఉంది.
స్పాట్...
నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారని కథలు కథలుగా చెప్పుకుంటారు. కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసుల చేతిలో ఆయుధంగా కూడా మారాడంటారు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారని సమాచారం. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు.
స్పాట్...
ఒకటి కాదు, రెండు కాదు.. 40కి పైగా హత్య కేసులు... వందకు పైగా బెదిరింపుల కేసులు. లెక్కలేనన్ని భూ దందాలు, సెటిల్మెంట్లతో సాగిన నయీం జీవితమే హింసాత్మకం.
స్పాట్...
కొన్నేళ్లపాటు నేరసామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఆ సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా తయారయ్యాడు. తన దారికి ఎవరైనా అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా నరికేశాడు.
స్పాట్...
1993లో ఐపీఎస్ వ్యాస్ను కాల్చి చంపడంతో మొదలు.. నయీం ఎన్కౌంటర్ జరిగిన ముందురోజు.. అతని అనుచరుడు వాజిద్ హత్య దాకా నయీం పాత్రపై అనేక ఆరోపణలు వచ్చాయి.
స్పాట్...
2000 డిసెంబర్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పౌర హక్కుల నేత పురుషోత్తంను హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో పట్టపగలే నరికిచంపిన కేసుతో పాటు.. మరో హక్కుల సంఘం నేత కరుణాకర్ను చంపిన కేసులోనూ నయీం నిందితుడు.
స్పాట్...
మరుసటి యేడాది అంటే.. 2001 ఫిబ్రవరిలో నల్గొండకు చెందిన ఏపీసీఎల్సీ నేత ఆజం అలీని నయీం గ్యాంగ్ కత్తులతో నరికి చంపేసిన ఘటనపై నల్గొండలో పోలీసు కేసు నమోదైంది. నయీమ్ జైలులో ఉండగానే ఈ హత్యకు కుట్ర చేశాడని ఆరోపణలున్నాయి.
స్పాట్...
అదే యేడాది డిసెంబర్లో శ్రీరాములు యాదవ్, బద్దుల మల్లేష్ యాదవ్, ఇక్కిరి సిద్దులు అనేముగ్గురిని మల్కాపూర్ శివారులో దారుణంగా హత్య చేశారు. పాత కక్షలతో నయీం గ్యాంగే ఈ హత్యలు చేసినట్లు కేసు చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో నమోదైంది.
స్పాట్...
2011లో నయీమొద్దీన్ ఆదేశాలతోనే అతని అనుచరులు.. మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన కోనాపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడును గొడ్డలితో నరికి చంపినట్లు వలిగొండ పోలీస్స్టేషన్లో కేసు ఉంది.
స్పాట్...
2014లో వలిగొండకు చెందిన అఫ్జల్ అహ్మద్ ఖాన్ను నయీం అనుచరులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. నయీం సూచనలతో అతని అనుచరులు షేక్ షకీల్, పాశం శ్రీను తదితరులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
స్పాట్...
అలాగే.. కోనాపురి అయిలయ్య తమ్ముడైన మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ నాయకుడు కోనాపురి రాములును కూడా నల్గొండలో నయీం ముఠా హత్య చేసింది. ఈ ఘటనపైనా నల్గొండ టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
స్పాట్...
ఇవే కాదు.. మావోయిస్టు కార్యకర్త, ప్రజా గాయకురాలు బెల్లి లలిత హత్య కేసులోనూ నయీమే కీలక నిందితుడు. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్రెడ్డి.. ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడి 11సార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు నయీం.
స్పాట్...
సైబరాబాద్, హైదరాబాద్లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా ప్లాన్లు అత్యంత పకడ్బందీగా ఉంటాయి. నేరాలు చేసే స్టయిల్ వెరైటీగా ఉంటుంది. నేరాలకు ప్లాన్ చేసేది ఒక గ్రూప్ అయితే.. ఆ నేరం చేసేది మరొక గ్రూప్. ఆ సంఘటన జరిగాక 48 గంటల్లోనే లొంగిపోయేది ఇంకో గ్రూప్. దీంతో.. పోలీసులు కూడా పక్కా సాక్ష్యాలు ఛేధించలేకపోయిన కేసులు ఎన్నో ఉన్నాయని చెబుతారు.
స్పాట్...
నయీం అరాచకాలు రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలోనూ పెట్రేగిపోయాయి. రాష్ట్రంలోనే కాక చత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్బెంగాల్లోనూ తననెట్వర్క్ను పెంచుకున్నాడు. గుజరాత్లో ఆయుధాల స్మగ్లింగ్ కేసులో మోస్ట్వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. 2008 ఏప్రిల్లో చోటారాజన్ అనుచరుడు అజీజ్రెడ్డి ఎన్కౌంటర్ వెనుక కూడా నయీం గ్యాంగ్తో విభేదాలే కారణమని సమాచారం. అంతేకాదు.. బంగ్లాదేశ్ నుంచి పాకిస్థాన్కు వెళ్లి ఐఎస్ఐతో చేతులు కలిపినట్లు పోలీసువర్గాలు గుర్తించాయి.
స్పాట్....
=================================================
=================================================
nayeem Four
-------------
నక్సల్స్పై యుద్ధం ప్రకటించాక భూదందాలు, సెటిల్మెంట్లనే ప్రధాన వ్యాపకంగా మార్చుకున్న నయీం.. గ్యాంగ్స్టర్ అవతారమెత్తాడు. తనకంటూ ఓ గ్యాంగ్ను రూపొందించుకున్నాడు. ఇక.. వెనుదిరిగి చూడలేదు. మాఫియా లెవెల్లో చెలరేగిపోయాడు.
స్పాట్...
voice over
----------
మొదట్లో హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నయీమ్.. ఆ తర్వాత రూట్ మార్చాడు. తన గ్యాంగ్ ఫామ్లోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక.. బాధ్యతలన్నీ గ్యాంగ్కు అప్పగించాడు. అందుకే నయీమ్ ప్రత్యర్థుల హత్య కేసుల్లో అతని అనుచర గణమే ప్రధాన నిందితులుగా ఉన్నారు.
స్పాట్...
భూ దందాలు, సెటిల్మెంట్లపై కన్నేసిన గ్యాంగ్స్టర్.. వివాదాస్పద భూముల్లోకి ఎంటరై అరాచకాలు సృష్టించాడు. సెటిల్మెంట్లలో తనదైన ముద్ర వేసుకున్నాడు.
స్పాట్...
ఎన్కౌంటర్లలో పలువురిని హతమార్చేందుకు తమకు సహకరించిన నయీమ్ను కొందరు పోలీసు అధికారులు బాగానే ఉపయోగించుకున్నారన్న వాదన ఉంది. ఓ దశలో పోలీసులు తమవల్ల కాని సివిల్ మ్యాటర్లు, భూ దందాలు, సెటిల్మెంట్లను నయీంతో చేయించారన్న ప్రచారమూ పోలీస్ డిపార్ట్మెంట్లో షికార్లు చేస్తోంది. ఫలితంగా ప్రతిఫలాన్ని కూడా పొందారని చెప్పుకుంటారు.
స్పాట్...
అందుకే నయీం దందాకు పలువురు పోలీసు అధికారులే పరోక్ష సహకారం అందించారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు.. పోలీస్ డిపార్ట్మెంట్ కదలికలూ ఎప్పటికప్పుడు నయీమ్కు చేరేవన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అతని ఇంట్లో ఏకంగా శాటిలైట్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు.
స్పాట్...
ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఎదిగిన నయీం నేరసామ్రాజ్యం శాఖోపశాఖలుగా విస్తరించింది. రాను రానూ నయీం కాదు.. నయీం పేరు చెబితేనే వణుకు పుట్టే పరిస్థితులు దాపురించాయి.
స్పాట్...
నయీమ్ అంటే ఓ పేరు కాదు, మాఫియాకి అదో బ్రాండ్ నేమ్.. అన్నట్లుగా కార్యకలాపాలు కొనసాగాయి. 2007లో ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్యకేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో.. పోలీసుల నుంచి తప్పించుకున్న నయీమొద్దీన్.. కొందరు పోలీసుల అండతో తన హవా నడిపించాడని చెబుతారు.
స్పాట్...
నయీమ్ పారిపోవడానికి పొలీసులే సహకరించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి. అప్పటి నుంచి నయీమ్ పూర్తిగా అజ్ఞాతంలో వుంటూనే గ్యాంగ్స్టర్గా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. గతంలో సాగించిన సెటిల్మెంట్లు కంటిన్యూ చేశాడు. అయితే.. అదే అదనుగా ఆయన పేరిట కొందరు అనుచరులు, దగ్గరి బంధువుల దౌర్జాన్యాలు కూడా పెరిగిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి.
స్పాట్...
అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. భాయ్ పేరుతో అతని గ్యాంగ్ ఊళ్లమీద పడింది. నియంతృత్వ పరిష్కారాలు, ఆదేశాలు.. కాదంటే చిత్రహింసలు పెట్టి ఖతం చేయడాలు కొనసాగాయి.
స్పాట్...
ఎవరిని టార్గెట్ చేసినా.. ముందు వాళ్ల చరిత్ర మొత్తం తెలుసుకుంటాడు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు, బలహీనతల చిట్టా మొత్తం గ్యాంగ్ సహకారంతో చేతికి అందుతుంది. ఇక.. భాయ్ చెప్పిందే ఫైనల్. మరో మాటకు తావుండదు.
స్పాట్...
భూ దందా అయితే చెప్పిన రేటుకు అమ్మేయాలి. పంపకాలు, సెటిల్మెంట్లు అయితే.. రెండు పార్టీలూ భాయ్ చెప్పినంత సమర్పించుకోవాల్సిందే... లేకుంటే బతుకు బేజారే...
స్పాట్...
భాయ్ టార్గెట్ చేసిన వాళ్లకు మొదట ఫోన్ కాల్స్ వెళ్తాయి. ఆ తర్వాత ఎస్ఎంఎస్లతో వేధింపులు కొనసాగుతాయి. మూవ్మెంట్స్ క్షణక్షణం వల్లెవేయడం ఎదుటివాళ్లను నిలువెల్లా వణికిస్తుంది. అంతే.. చేతనైతే డిమాండ్ చేసినంతా చేతుల్లో పెట్టాలి. లేకుంటే.. కాళ్లా వేళ్లాపడి ఎంతో కొంత బేరమాడుకోవాలి. కానీ.. ఊరికే వదిలేయడం మాత్రం అసంభవం.
స్పాట్...
తనకు ఎదురు తిరిగారనో, తన దందాకు అడ్డువచ్చారనో తెలిస్తే.. భాయ్ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టడు. నీడలా వెంటాడుతాడు. భయమంటే ఏంటో.. చావు ఎలా ఉంటుందో ఎదుటివాళ్లకు ప్రత్యక్షంగా చూపిస్తూ.. తాను చూస్తూ పైశాచిక ఆనందం పొందుతాడు. అతని చేతిలో హతమై.. గుర్తు తెలియని మృతదేహాలుగా నమోదైన సందర్భాలూ అనేకం ఉన్నాయంటారు అతని మనుషులు.
స్పాట్...
మొత్తానికి సమాంతర ప్రభుత్వాన్నే నడిపిన నయీమ్.. అరాచకాలకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్న పోలీసులు.. ఆరేళ్లుగా తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నారు. పోలీసులు తనగురించి వేట కొనసాగిస్తున్నారని కూడా ముందే పసిగట్టాడు నయీమ్. పోలీస్ టెక్నిక్స్ వంట బట్టించుకున్న ఈ గ్యాంగ్స్టర్.. తనదైన శైలిలో అండర్ వరల్డ్ను ఏర్పరచుకున్నాడు. పోలీసులు పసిగట్టలేనంత పకడ్బందీ వ్యూహాలు అమలు చేశాడు.
స్పాట్...
చివరి రోజుల్లో చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నయీం భాయ్.. తన సెక్యూరిటీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అనుచరులుగా తన అడుగులకు మడుగులొత్తిన వాళ్లను కొంతకాలమే చేరదీసి తర్వాత దూరం చేశాడు. గన్మెన్లనూ ఎప్పటికప్పుడు మార్చేసేవాడు. తన ఉనికి దొరక్కుండా జాగ్రత్తపడేవాడు.
స్పాట్...
మెదక్ జిల్లా జహీరాబాద్లో జరిగిన అనుచరుడి హత్యలో నయీం ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. జహీరాబాద్ నుంచి తెల్లవారుజామున నయీం.. తన గ్యాంగ్తో కలిసి హైదరాబాద్ మీదుగా.. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్కు చేరుకున్నాడు.
స్పాట్...
పోలీస్ రికార్డుల ప్రకారం.. జూలై 15వ తేదీన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ్పీటీసీ భర్తను సెల్ఫోన్లో బెదిరించింది నయీం గ్యాంగ్. యాంటీ నక్సలైట్ గ్రూప్ అయిన తమ అవసరాలకోసం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మరుసటిరోజు కూడా ఫోన్చేసి బెదిరించడంతో పాటు.. అదేరోజు 'ఇది భాయ్సాబ్ హుకుం' అని మెస్సేస్ కూడా పంపింది. షాద్నగర్ వచ్చి ఆ మొత్తం సమర్పించుకోవాలని కూడా హుకుం జారీ చేసింది. ఈ సమయానికి నయీం షాద్నగర్ చేరుకున్నాడు.
స్పాట్...
తాను అంతమొత్తం ఇచ్చుకోలేనన్న జెడ్పీటీసీ భర్త గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. రంగంలోకి దిగిన పోలీసులు నయీం ఆట కట్టించారు. ఎన్కౌంటర్లో హతం చేశారు.
స్పాట్...
నక్సలైట్ల ఆనుపానులు తెలుసుకొని వాళ్లకే ఎసరుపెట్టాడు. తర్వాత పోలీసులకు కోవర్టుగా మారి వాళ్ల పేరును ఉపయోగించుకొని చెలరేగిపోయాడు. మొత్తానికి మోస్ట్ వాంటెడ్గా మారి.. ఆపరేషన్ నయీంతో హతమైపోయాడు.
స్పాట్...
=================================================
=================================================
nayeem Five
-------------
ఆపరేషన్ నయీమ్ సక్సెస్ అయ్యింది. అతనికి టార్గెట్గా మారిన వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులూ.. అతని నేర సామ్రాజ్యంపై దృష్టిపెట్టారు. మరి.. ఈ పరిణామాలతో పని పూర్తయినట్లేనా..? నయీం పీడ విరగడైనట్లేనా..?
voice over
----------
కారణమేదైనా.. ఉసిగొల్పింది ఎవరైనా.. నయీమ్.. ఓ నయా దందాకు మార్గం కనిపెట్టాడు. ఎవరి అవసరాలకు వారు వాడుకున్నా.. ఎదుటి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆ తర్వాత చెలరేగిపోయాడు. తనకు మొదట్లో అండగా ఉన్నవాళ్లకే ఏకు మేకై కూర్చున్నాడు.
స్పాట్...
కాలక్రమంలో ఆత్మవిశ్వాసం హద్దులు దాటింది. అత్యాశ మితిమీరిపోయింది. తనకు ఎదురేదీ లేదన్న ఆలోచన వక్రబుద్ధి పట్టించింది. ఎదుటివాళ్లు ఎవరైనా లెక్కచేయని తత్వం పెరిగిపోయింది.
స్పాట్...
ఎన్కౌంటర్కు దారితీసిన పరిణామాలను పక్కనబెడితే.. పెట్రేగిపోయిన నయీం అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన ఎవరు అవునన్నా కాదన్నా.. హర్షించదగినదే... ఆరునెలలుగా పోలీసులు వేటాడటం నిజమే అయితే.. ఇన్నాళ్లూ అతని జాడ కనుక్కోలేకపోవడం వెనుక లోపాలను సమీక్షించుకోవాల్సిందే... పోలీసు వ్యూహం గురించి నయీమ్కు ముందే ఉప్పందినట్లు గ్రహిస్తేమాత్రం.. అలాంటి ఆలోచనలను కూకటివేళ్లతో పెకిలించి వేయాల్సిందే...
స్పాట్...
నయీం డైరీ.. ఓ మాఫియా పుట్ట. అందులో ప్రతి పంక్తిలోనూ అమాయకులను వేధించిన ఆనవాళ్లున్నాయి. పేజీ పేజీలోనూ అరాచకాల మూలాలున్నాయి. తాను చేసిన దందాలకు సాక్ష్యాలున్నాయి. తనకు సహకరించిన వాళ్ల బండారం ఉంది. బినామీల వ్యవహారం ఉంది. తాను పెంచి పోషించిన మాఫియా గ్యాంగ్ చిట్టా ఉంది.
స్పాట్...
గ్యాంగ్స్టర్ ఖతమైపోయాడు. మరి.. జనంతో ఆడుకున్న మాఫియా డాన్ ఒక్క నయీమేనా..? జనాన్ని పీడిస్తూ.. అరాచకాలకు పదును పెడుతూ.. చెలరేగిపోతున్న మిగతావాళ్ల సంగతేంటి..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం వెతకాలి. ఇలాంటి విష సంస్కృతిని మొక్కలోనే తుంచి వేయాలి.
స్పాట్...
10, ఆగస్టు 2016, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)





