16, సెప్టెంబర్ 2015, బుధవారం

ఇంకెన్నాళ్లీ విద్వేషాలు?

తెలుగువారికి రెండు రాష్ట్రాలు,  ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న సంతోషం  ఇంకాయేడాది కూడా కాలేదురెండు ప్రభుత్వాల వైఖరి పోటాపోటీ వ్యూహాలు,అంతకుమించి కేసు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడి వేస్తేభగ్గుమనే పరిస్థితి నెలకొందినిజానికి పార్టీ పరంగా చూస్తే టీఆర్ఎస్టీడీపీ మధ్యేఅధిపత్య పోరు కాగా... తెంగాణలో టీఆర్ఎస్ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోఉండటంతో  వ్యవహారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటంలాతయారైందిఫలితంగా ఎవరి అనుకూల ప్రకటనలు వారు చేసుకుంటున్నారు.అధికారులను అడ్డుపెట్టుకొని రాజకీయ వికృత క్రీడ సాగిస్తున్నారుమొత్తానికి వ్యవహారం తెలుగు ప్రజల మనోభావాల మధ్య చిచ్చు పెట్టేదిగా ముందుకుసాగుతోంది.
విభజన జరిగినప్పటినుంచీ పంపకాలుకేటాయింపుల్లో  మాత్రం సర్దుబాటుధోరణి వ్యక్తం చేయని ప్రభుత్వాలు.. వీలైనప్పుడల్లా కయ్యానికే కాలుదువ్వుతున్నాయిపైగా  అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగాఆత్మగౌరవసమస్యుగా చిత్రీకరిస్తూ ప్రజలకు కూడా ఇందులో  పాత్ర కల్పించేందుకుపాలకులు ప్రయత్నిస్తున్నారుఇక్కడ వాగ్బాణాలు వదలడం... ఢల్లీలో వెళ్లి కేంద్రంసమక్షంలో చర్చలంటూ పట్టుబట్టడం యేడాది కాలంగా సర్వసాధారణంగామారిందిరాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులుఅప్పులుపంపకాలుకేటాయింపుసామరస్యపూర్వకంగా... ఉమ్మడి అభిప్రాయాలను  గౌరవిస్తూ  పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండగా... నాయకులు మాత్రం ‘ఎవరికి వారే... యమునాతీరే’ అన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారుఫలితంగా తెలుగు ప్రజల మధ్య ఒక లోతైనఅగాధం ఏర్పడుతున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుతో ఇరు రాష్ట్రప్రభుత్వాల వ్యవహారశైలి రచ్చకెక్కింది కేసులో రేవంత్రెడ్డి  ప్రత్యక్షంగా పట్టుబడగా... ఏపీ సీఎం  చంద్రబాబు  నాయుడు  వెనుక ఉండి నడిపించారంటూతెలంగాణ ప్రభుత్వం ప్రచారం  చేసింది.  చంద్రబాబు  గొంతుగా చెబుతున్నఆడియో టేపునూ బయటపెట్టిందిఏకంగా  ముఖ్యమంత్రే లక్ష్యంగా పక్క  రాష్ట్రప్రభుత్వం పావులు కదపడాన్ని... ఆంధ్రప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది.పోటీగా ఏపీలో కేసీఆర్పై ఆయా సందర్భాల్లో నమోదైన 87 కేసులనుతవ్వితీసిందిఅంతేకాదు...  కేసులను ఆగమేఘాల మీద సీఐడీకిఅప్పగించింది కూడాతమకు ఏదైనా హాని తలపెడితే.. తామేంటో చూపిస్తామన్నస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు మానసికంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైందినేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కేసులో తెంగాణ ప్రభుత్వంనోటీసులు ఇవ్వబోతుందన్న ప్రచారంతో రెండుమూడు రోజులు హైదరాబాద్లో తీవ్రఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయిఅటు.. ఆత్మరక్షణలో బడ్డ టీడీపీపార్టీతోపాటు... సీఎంకు రక్షణగామంత్రులకు రక్షణగా ఏపీ ప్రభుత్వం తమబలగాలను దింపిందిమంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.ఇంకా నిత్యం విమర్శ ల జోరు కొనసాగుతూనే ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య రగడతో మీడియా కూడా రెండుగా చీలిన సందర్భంగోచరిస్తోందిపత్రికలు తిరగేసినా..  టీవీ  చూసినా... ఎందులో  వచ్చింది వాస్తవమో,  దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక సాధారణ పాఠకులు,ప్రేక్షకులు అయోమయంలో పడిపోతున్నారుతెలంగాణ అనుకూల పత్రికల్లోవస్తున్న వార్తలుఆంధ్రప్రదేశ్ అనుకూల మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లోతేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందిచివరకు సెక్షన్`8 విషయంలో కేంద్రాన్నీమధ్యలోకి దింపింది వర్గం మీడియాఒకే వార్త రెండు భిన్న పత్రికల్లో రెండువిభిన్న పార్శ్వాల్లో వస్తుండటంతో ఏది వాస్తవమో   తెలియక   జనం  జుట్టుపీక్కుంటున్నారుమీడియాలో వస్తున్న గందరగోళ సమాచారానికి ముగింపుపలికేలా... కేంద్రం జోక్యం  చేసుకోవాని  ఎవరికి   వారు అంటున్నారుకేంద్రంప్రత్యక్ష జోక్యానికి సిద్ధంగా లేదు.
రాష్ట్రం విడిపోక ముందు రాజకీయపార్టీలు ప్రజలను ఎలా పావుగావాడుకున్నాయో.. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా వాటి వ్యవహారశైలిఅలాగే కొనసాగుతున్నదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారుఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యంనెలకొనాలని ఆశిద్దాంఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఐకమత్య భావనపెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది.
హంసిని సహస్ర సాత్విక
(లోకహితం మాసపత్రిక June-15లో ప్రచురితం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి