26, నవంబర్ 2015, గురువారం

మన్‌కీబాత్‌లో అవయవదానాన్ని నొక్కి చెప్పిన మోదీ




ప్రజల భాగస్వామ్యంతోనే దేశాన్ని నడిపించాలన్న మహోన్నత లక్ష్యం మోదీ మన్కీ బాత్ కార్యక్రమము. తాజాగా అక్టోబర్25 తేదిన నిర్వహించిన మన్కీబాత్ కార్యక్రమంలో పలు అంశాలపై మోదీ మనసు విప్పి ముచ్చటించారు. అవయవదానాన్ని ఉద్యమంలా చేపట్టాల్సిన ఆవశ్యకతను నరేంద్రమోదీ గుర్తుచేశారు. దేశంలో అవసరమైన అవయవ దానాలు జరగడం లేదని చింతిస్తూనే దాన్ని అధిగమించడానికి చేయాల్సిన ప్రయత్నాలను విశదీకరించారు. ప్రతి సంవత్సరం దేశంలో రెండున్నర లక్షలకంటే ఎక్కువగా మూత్రపిండాలు, గుండె, కాలేయదానం అవసరం ఉండగా కేవలం ఐదువేల అవయవ మార్పిడులే జరుగుతున్నాయని చెప్పారు. లక్ష కళ్ళకు చూపు అవసరమవుతుండగా 25 వేల వరకే చేయగుగుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వాళ్ళ అవయవలను కూడా దానం చేయవచ్చని, ఇందుకోసం చట్టపరమైన అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. అవయవదానం పట్ల స్ఫూర్తి కలిగేలా కేరళలోని చిత్తూర్లో ఉన్న సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థులు వేలిముద్రతో తయారు చేసిన భారతమాత చిత్రాన్ని తనకు పంపించారని.. వారిని అభినందించారు. మహారాష్ట్రకు చెందిన వసంతరావు సుడ్కే గురూజీ అవయవదానం పట్ల సాగిస్తున్న ఉద్యమానికి అభినందనలు తెలిపారు. అవయవదానం ఒక వృత్తి, ప్రవృత్తిలాగా మారాలని ఆకాంక్షించిన మోదీ దేశంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ఫ్లాంట్ ఆర్గనైజేషన్ (నోటో)ను స్థాపించామని చెప్పారు.
ఇండో ఆఫ్రికన్ సమ్మిట్ కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థిని రాసిన కవితను మోదీమన్కీబాత్కార్యక్రమంలో కొంత భాగాన్ని చదివి వినిపించారు. ఈసారి మోదీ మన్కీబాత్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల ప్రస్తావని తీసుకురావటం విశేషంగా చెప్పకోవచ్చు. విజయనగరం జిల్లాకు చెందిన కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు ద్వారపూడి గ్రామ పంచాయతీని ఆదర్శగ్రామంగా ఎంపిక చేసుకొని సృజనాత్మకమైన పనిచేపట్టారని ప్రధాని ప్రశంసించారు. గ్రామంలోని 550 మంది నిరాక్షరాస్యులైన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలే రోజూ సాయంత్రం గ్రామంలోని పాఠశాలలో చదువు చెబుతున్నారని, ఎలాంటి బడ్జెట్, సర్క్యులర్, ఆదేశాలు, ప్రత్యేక వ్యవస్థ లేకుండానే. కేవలం సంకల్పబలంతో ఇంత పెద్ద పరిణామం తీసుకొచ్చారని నరేంద్రమోదీ ప్రశంసించారు. అలాగే స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఈనాడు, ఈటీవీ గ్రూప్స్ అధినేత రామోజీరావు ప్రజల్లో తెస్తున్న చైతన్యాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా సంస్థలైన ఈనాడు, ఈటీవీ గ్రూప్స్ పరిశుభ్రత కార్యక్రమాన్ని మిషన్లాగా చేపట్టాయని ప్రశంసించారు.అలాగే ఏబీసీ న్యూస్ ఛానెల్, ఎన్డీటీవీ, దైనిక్ జాగరణ్, జీ నెట్వర్క్ మీడియా సంస్థలను ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న తీరును ప్రస్ఫుటించారు ప్రధానిమోది. దేశంలోని దాదాపు అన్ని మీడియా సంస్థలు పరిశుభ్రతపై ప్రచారం చేపట్టాయని చెప్పారు. అతిచిన్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరం నుండి లోక్సభకు ప్రాతినథ్యం వహిస్తున్న సి.ఎల్.రువాలా.. అక్కడి రువాం గ్రామంలో మార్చి 11 తేదిన చెరుకు ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా అమ్మకాలు పెరిగి గ్రామ ఆర్థికస్థితి మెరుగుపడిందని మోదీ మన్కీ బాత్లో తెలిపారు. ఇక పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు ఇంటర్వూ సమయంలో సిఫార్సు పేరిట నష్టపోతున్నారన్న వాదన నేపథ్యంలో.. వచ్చే జనవరి1 నుంచి గ్రూప్`డి, గ్రూప్`సి, గ్రూప్`బి నాన్గెజిటెడ్ ఉద్యోగా భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అదే విధంగా బంగారాన్ని నగదుగా మార్చుకునే పథకాన్ని తీసుకొచ్చామన్న మోదీ.. పథకం నేపథ్యం, వివరాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఇకపై 5గ్రాముల, 10గ్రాముల, 20గ్రాముల బంగారునాణాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇప్పటిదాకా బంగారంపై విదేశీ ముద్రలే ఉన్న కారణంగా స్వదేశీ ముద్ర ఎందుకు ఉండొద్దన్న భావనతో అశోకచక్రంతో కూడిన బంగారు నాణేలు తయారు చేస్తున్నామన్నారు. దీపావళి మరునాడు తన బ్రిటన్ పర్యటన గురించి కూడా మోదీ ప్రస్తావించారు. లండన్లో డాక్టర్ అంబేద్కర్ నివశించిన నివాసం ఇప్పుడు భారత సంపద అయ్యిందని దాన్ని ప్రారంభించేందుకు బ్రిటన్ వెళ్తున్నానన్నారు. బ్రిటన్కు పైచదువు కోసం వెళ్ళే భారతీయులకు అంబేద్కర్ నివాసం పుణ్యక్షేత్రం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ప్రేరణతో భారతీయ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు, కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగత భావనను కూడా నరేంద్రమోదీ వెలిబుచ్చా రు. దీపావళి పర్వదినం సమీపిస్తున్నందున పండుగ సంబరాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, పిల్లలు టపాకాయలు కాల్చే విషయంలో తల్లిదండ్రులు జాగరూకత వహించాలని జాగ్రత్త చెప్పారు. తర్వాత రోజు పండుగ వ్యర్థాలు శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 25 జరిగిన మోదీ మన్కీబాత్ యేడాది పూర్తిసుకుంది.

-  లోకహితం మాసపత్రిక (నవంబర్‌ 2015)లో ప్రచురితం



3, నవంబర్ 2015, మంగళవారం

సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు

 

        506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంఎస్‌వోలు, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరమైతే కేబుల్‌ ఆపరేటర్లకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది.

          సుప్రీంకోర్టు సమ్మెట దెబ్బకు.. సంకెళ్లు పటాపంచలయ్యాయి. అధికారం అండతో కేబుల్‌ ఆపరేటర్లను బెదిరించి అధికార పార్టీ హరించిన స్వేచ్ఛ మళ్లీ రెక్కలు విచ్చుకుంది. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలపై కేసీఆర్‌ సర్కారు విధించిన దొడ్డిదారి నిషేధానికి తెరపడింది. ఏబీఎన్‌ ప్రసారాలనుపునరుద్ధరించి తీరాలని భారత సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎంఎస్‌వోలను, తెలంగాణలోని పది జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగానే చానెళ్లపై మండిపడిన వైనమే సర్కారీ తంత్రానికి నిదర్శనమని మందలించింది. ఎంఎస్‌వోల వెనుక ఉండి ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేసింది ప్రభుత్వమే అని అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రోద్భలంతోనే ఎంఎస్‌వోలు చానెల్‌ ప్రసారాలు నిలిపివేశారంటూ ఏబీఎన్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను జస్టిస్‌ జగదీష్‌సింగ్‌ ఖేహార్‌, జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. వాడివేడిగా సాగిన వాదనలను విన్న అనంతరం... తెలంగాణలో ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే... గత ఏడాది జూన్‌ 16వ తేదీన ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేశారని చానల్‌ తరఫు న్యాయవాదులు గంగూలీ, జి.ప్రభాకర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రసారాలు చేసిందనే సాకుతో.. ఏకపక్షంగా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఏబీఎన్‌ను నిలిపి వేశారని అన్నారు. ఎంఎస్‌వోలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చినందుకే చానల్‌ ప్రసారాలు నిలిపివేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. గతంలో జీ టెలీఫిలిమ్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గంగూలీ ఉటంకించారు. చానల్‌ ప్రసారాలను నిలిపివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ (నియంత్రణ) చట్టం, 1995 ప్రకారం ఎంఎస్‌వోలకు ఆ అధికారం లేదని వాదించారు. దీంతో.. చానల్‌ను నిషేధించడమంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కోర్టు అభిప్రాయపడింది. వెంటనే చానల్‌ ప్రసారాలను పునరుద్ధరించాలని ధర్మాసనం అదేశించింది. అవసరమైతే ఎంఎస్‌వోలకు రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి, సీఎస్‌కి ఆదేశాలిచ్చింది.

          సందర్భం వచ్చినప్పుడల్లా నిషేధంతో తమకేమీ సంబంధం లేదని చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారుకు సుప్రీం మొట్టికాయ వేసింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ మాకు సంబంధం లేదన్న తెలంగాణ సర్కారు తరపు న్యాయవాది వాదనపై ధర్మాసనం మండిపడింది. చానెల్‌ ప్రసారాలు నిలిపివేయాలని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా చెప్పారని, ఎంఎస్‌వోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని అంతకంటే నిదర్శనం ఏం కావాలని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. హైకోర్టులో ఎంఎస్‌వోలు సమర్పించిన అఫిడవిట్‌లోనూ అదే అంశాన్ని ప్రస్తావించారని న్యాయస్థానం గుర్తు చేసింది. కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది కిరణ్‌ సూరి కూడా అసలు గుట్టు విప్పారు. అక్రమంగా చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై 2014 జూలై 17వ తేదీనే కేంద్ర ప్రభుత్వం 37 మంది ఎంఎస్‌వోలకు నోటీసులు జారీచేసిందని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తాము ఏబీఎన్‌ ప్రసారాలు నిలిపివేసినట్లు చాలామంది ఎంఎస్‌వోలు కేంద్రానికి తెలియజేశారని చెప్పారు. ఏబీఎన్‌ ప్రసారాలు పునరుద్ధరిస్తే తమపై దాడి జరిగే అవకాశం ఉందని ఎంఎస్‌వోలు హైకోర్టుకు వెల్లడించిన విషయాన్ని కూడా ఏబీఎన్‌ తరపు న్యాయవాది గంగూలీ సుప్రీం దృష్టికి తెచ్చారు.  సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినదే తుది తీర్పు అని ఏబీఎన్‌ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌ తేల్చిచెప్పారు. తక్షణమే ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునరుద్ధరించాల్సి ఉంటుందన్నారు. ఈ తీర్పుపై ఎవరూ, ఎక్కడాఅప్పీల్‌ చేసే అవకాశం కూడా లేదన్నారు.

19, అక్టోబర్ 2015, సోమవారం

ఎన్నాళ్లీ మరణమృదంగం?

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే.. రాష్ట్ర ఏర్పాటుతో సంబంధం లేని అతిపెద్ద సమస్య ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. అదే అన్నదాత ఆత్మహత్య సమస్య. ’కర్ణుడి చావుకు కారణాలనేకంఅన్నట్లు తెంగాణలో రైతు అకాల మరణాలకు కారణాలు క్యూ కడుతున్నాయి. వాటిని గుర్తించడం, అధిగమించడం కష్టసాధ్యమే అయినా.. పక్కా ప్రణాళికతో ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. రైతుల ఆత్మహత్యలు గతంలోనూ ప్రభుత్వాలకు సవాల్ విసిరిన సందర్భాున్నాయి. అయితే.. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న మరణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. రైతు ఆత్మహత్యలే కాదు.. కళ్లముందు కనిపిస్తున్న పరిస్థితులు, భవిష్యత్తుపై భయాన్ని పెంచడం మూలంగా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య కూడా నమోదవుతోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ సందేహం తొలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోకన్నా.. తెలంగాణ స్వయం పాలిత రాష్ట్రం సమృద్ధిగా ఉంటుందనుకుంటే గతంలో కన్నా తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడం ఇటు రైతులను, అటు విశ్లేషకులను ఆవేదనకు గురిచేస్తోంది. మరోవైపు.. కేసీఆర్ ప్రకటనలు, హామీలు, ప్రణాళికలు ఏవీ రైతుకు భరోసా ఇచ్చేందుకు దోహదపడటంలేదు భూగర్భ జలాలు అడుగంటడం, వరుణుడు కరుణించకపోవడం, నాసిరకం విత్తనాలు వంటి సమస్యకు తోడు.. రైతు రుణమాఫీ పథకం కూడా గందరగోళంగా తయారవడం అన్నదాతకు శరాఘాతంగా పరిణమించింది. ఇప్పటివరకు రైతుల రుణమాఫీ మిస్టరీ గానే మారింది. పెట్టుబడులు భారీగా పెరిగిపోవడం, పంటకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా అకాల మరణాలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.
ఆత్మహత్య నివారణకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం..చనిపోయిన రైతు కుటుంబాలకు 6లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయినా.. ఆత్మహత్యలు ఆగడం లేదు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వ్యవసాయమే దండగ అనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం అంశంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దీనిపై విస్తృతంగా చర్చించాల్సి ఉంది.  ఆత్మహత్యల నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు.. నిధిని ఏర్పాటుచేస్తే ఆర్థికంగా తోడ్పాటుగా ఉంటుంది. అలాగే. ఆత్మహత్యలపై ప్రభుత్వం పూర్థిస్థాయిలో విచారణ కమిటీ వేసి కారణాలను విశ్లేషించాల్సి ఉంది. రైతు వ్యవసాయాన్నే నమ్ముకుంటున్నారా... వారి కుటుంబ, ఆర్థిక, రాజకీయ పరిస్థితు ఏమిటన్న వాటిపై సమగ్ర విచారణ జరిపించాల్సి ఉంది. చనిపోయిన వారి కుటుంబనేపథ్యం, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపైనా అధ్యయనం చేయాల్సి ఉంది. తెలంగాణ తేవడమొక్కటే తమ లక్ష్యమన్నట్టుగా.. లక్ష్యాన్ని సాధించామన్నట్టుగా.. ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం కూడా సరైంది కాదు. మరోవైపు.. ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటికేదో సానుభూతి ప్రకటించి మమ అనిపించుకోవడం, తర్వాత అంశాన్ని పూర్తిగా మర్చిపోవడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వతమైన పరిష్కారం కనుగొనే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రైతన్నకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసాను కూడా కలిగించాల్సి ఉంది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే విధంగా బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.
- హంసిని సహస్ర సాత్విక

బతుకమ్మ వైభవం.. తెలంగాణలో వైభోగం


    తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రముఖమైన పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. ప్రతియేటా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మాసాల్లో జరుపుకునే జంట పండుగలు బతుకమ్మ, దసరా (విజయదశమి). తెలంగాణలో ఇవే అతిపెద్ద పండుగలు. అందుకే ఈ పండుగల సమయంలో ఇక్కడి సమాజమంతా కోలాహలంగా మారిపోతుంది.

    శిబ్బి అని పిలవబడే పాత్రలో గానీ, తాంబాలం అని పిలవబడే పెద్ద రాగిపళ్లెంలో గానీ రంగు రంగుల పూలను త్రికోణాకారంలో.. ఒక్కో వరుసలో రంగులు మారుస్తూ పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. సాయంత్రం వేళ కూడళ్లలో బతుకమ్మలన్నీ ఉంచి వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ లయబద్దంగా పాడే పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఆ తతంగాన్ని స్వయంగా చూసి తీరాల్సిందేగానీ, వర్ణించడం కష్టం. తొలుత బొడ్డెమ్మతో మొదలై తొలిరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. చివరి రోజు అంటే దసరా ముందు రోజు గానీ, రెండ్రోజుల ముందుగానీ సద్దుల బతుకమ్మగా వర్ణిస్తారు. సద్దుల బతుకమ్మలు ఎత్తులో, అందంలో ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. చివరిరోజు బతుకమ్మలను ఎంత భారీగా పేరిస్తే అంత గొప్పగా భావిస్తుంటారు. బతుకమ్మలు ఆడిన తర్వాత చివరగా వాటిని నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. నీటి ప్రవాహం అందుబాటులో లేని ప్రదేశాల్లో, నగరాల్లో బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకే ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మిస్తారు.

    బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరిలో.. శీతాకాలపు తొలిరోజుల్లో వస్తుంది. అప్పటికే చెరువులన్నీ నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు, రంగు రంగులలో అలరిస్తూ ఉంటాయి. వీటిలో గునగ పూలు, తంగేడు పూలు, బంతి, చేమంతి, నందివర్ధనం వంటి పూలతో బతుకమ్మలను పేరుస్తారు. గునగపూలకు ఆకర్షణీయమైన రంగులు కూడా అద్దుతారు. చివరిగా పసుపుతో చేసిన గౌరమ్మను గానీ, గుమ్మడి పూల గౌరమ్మను గానీ బతుకమ్మపై అలంకరిస్తారు. ఆఖరున బతుకమ్మపై అగరువత్తులు ముట్టించి కూడళ్లకు తీసుకెళ్తారు. ఆ తర్వాత దీపాలతోనూ బతుకమ్మను అలంకరిస్తారు. దాదాపు అర్థరాత్రి దాకా వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. సద్దుల బతుకమ్మ నాడు పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చడం వల్ల మగవారు వాటిని నిమజ్జనం చేస్తారు. ఆతర్వాత మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇదే క్రమంలో ఇళ్ల నుంచి తీసుకొచ్చిన సత్తుపిండిని, మలీద ముద్దలను పంచుకుంటారు. మొక్కజొన్నలు, పల్లీలు, పెసలను వేయించి నెయ్యి కలిపి... చక్కెర పాకంతో గానీ, బెల్లం పాకంతో గానీ సత్తుపిండి తయారు చేస్తారు.

    కూడళ్లలో బతుకమ్మలు ఆడటం పూర్తయిన తర్వాత వాటిని తలపై పెట్టుకొని చెరువులుగానీ, నీటి ప్రవాహాల దగ్గరకు గానీ పాటలు పాడుతూనే తీసుకెళ్తారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు. సాయంత్రం కూడళ్ల నుంచి మొదలు.. నిమజ్జనం చేసేదాకా బతుకమ్మ పాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులూ  ఈ తతంగం కొనసాగుతుంది. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో ఎక్కువగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరిరోజు సద్దుల బతుకమ్మలు మాత్రమే పేరుస్తున్నారు.

    బతుకమ్మ పాటల్లో కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు పల్లవిస్తాయి. చాలా వినసొంపుగా ఉండే బతుకమ్మ పాటలు వింటూంటే మైమరిచిపోవడం ఖాయం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.

    బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో బతుకమ్మ పండుగ భూమితో, జలంతో చిరకాలం ఉండే మానవ అనుబంధాన్ని చాటిచెబుతుంది.

    బతుకమ్మ పండుగకు ఆడపడుచులంతా అత్తింటినుంచి పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీ. పుట్టింట్లోనే తొమ్మిదిరోజులూ బతుకమ్మ వేడుకలు జరుపుకొని, దసరా పండుగ జరుపుకొని తిరిగి వెళ్తారు.

    బతుకమ్మ పండుగను తెలంగాణలో శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. అయితే.. ఈ సంప్రదాయం ఎలా మొదలైందన్న దానికి మాత్రం రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తలచుకొని..తోటి మహిళలు  వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా.. బతుకు అమ్మా.. అని దీవిస్తూ పాటలు పాడేవారని చెబుతారు. ఓ బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని ఆశీర్వదించారట. ప్రతియేడూ ఆమెను తలచుకుంటూ బతుకమ్మ పండుగ జరుపుకునే వారని అంటారు. స్త్రీలు ఎటువంటి ఆపదలూ రావొద్దనీ, తమ పతులు, కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. మరో కథలో.. దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు చేయగా.. ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఓ కూతుర్ని కన్నది. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండాలు గట్టెక్కిందని.. ఆమె తల్లిదండ్రులు బతుకమ్మ అని నామకరణం చేశారు. అప్పటినుంచి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడం ఆనవాయితీ అయ్యిందని కూడా కథ నానుడిలో ఉంది. ఇక మరో కథ చూస్తే.. ఓ ముద్దుల చెల్లికి ఏడుగురు అన్నదమ్ములున్నారు. అందరూ వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచ ప్రాణాలు కానీ.. వదినలకు మాత్ర అసూయ.ఆ బంగారు బొమ్మను బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అదే సమయంలో వదినలు సూటిపోటి మాటలతో వేధించడంతో చెల్లెలు ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత అన్నలు వచ్చి చెల్లెలు ఎక్కడని భార్యల్ని నిలదీశారు. విషయమై అర్థమైన అన్నలు.. తిండీ తిప్పలు లేకుండా, నిద్రాహారాల్లేకుండా చెల్లె కోసం వెదుకుతారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటుండగా పెద్ద తామర పూవు కనిపించింది. వాళ్లను చూడగానే నీటిలో తేలుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్ని ఏలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెరువు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది. ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారని మరో ఐతిహ్యం. ఆత్మ త్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు.

    తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమంలో బతుకమ్మతో చేసిన ఊరేగింపులు, కార్యక్రమాలు తెలంగాణ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించాయి.

    ఇక సద్దుల బతుకమ్మ మరుసటిరోజు జరుపుకునే దసరా పండుగరోజు వాహనాలను కడిగి పూలు, కంకణాలతో అలంకరిస్తారు. వృత్తిపనుల వారు పనిముట్లకు పూజలు చేస్తారు. కొత్తవ్యాపారాలు కూడా మొదలు పెడతారు. ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోయడం, గృహప్రవేశాలు,దుకాణాల ప్రారంభం కూడా దసరా నాడు చేస్తారు.

16, సెప్టెంబర్ 2015, బుధవారం

ఇంకెన్నాళ్లీ విద్వేషాలు?

తెలుగువారికి రెండు రాష్ట్రాలు,  ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న సంతోషం  ఇంకాయేడాది కూడా కాలేదురెండు ప్రభుత్వాల వైఖరి పోటాపోటీ వ్యూహాలు,అంతకుమించి కేసు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడి వేస్తేభగ్గుమనే పరిస్థితి నెలకొందినిజానికి పార్టీ పరంగా చూస్తే టీఆర్ఎస్టీడీపీ మధ్యేఅధిపత్య పోరు కాగా... తెంగాణలో టీఆర్ఎస్ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోఉండటంతో  వ్యవహారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటంలాతయారైందిఫలితంగా ఎవరి అనుకూల ప్రకటనలు వారు చేసుకుంటున్నారు.అధికారులను అడ్డుపెట్టుకొని రాజకీయ వికృత క్రీడ సాగిస్తున్నారుమొత్తానికి వ్యవహారం తెలుగు ప్రజల మనోభావాల మధ్య చిచ్చు పెట్టేదిగా ముందుకుసాగుతోంది.
విభజన జరిగినప్పటినుంచీ పంపకాలుకేటాయింపుల్లో  మాత్రం సర్దుబాటుధోరణి వ్యక్తం చేయని ప్రభుత్వాలు.. వీలైనప్పుడల్లా కయ్యానికే కాలుదువ్వుతున్నాయిపైగా  అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగాఆత్మగౌరవసమస్యుగా చిత్రీకరిస్తూ ప్రజలకు కూడా ఇందులో  పాత్ర కల్పించేందుకుపాలకులు ప్రయత్నిస్తున్నారుఇక్కడ వాగ్బాణాలు వదలడం... ఢల్లీలో వెళ్లి కేంద్రంసమక్షంలో చర్చలంటూ పట్టుబట్టడం యేడాది కాలంగా సర్వసాధారణంగామారిందిరాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులుఅప్పులుపంపకాలుకేటాయింపుసామరస్యపూర్వకంగా... ఉమ్మడి అభిప్రాయాలను  గౌరవిస్తూ  పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండగా... నాయకులు మాత్రం ‘ఎవరికి వారే... యమునాతీరే’ అన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారుఫలితంగా తెలుగు ప్రజల మధ్య ఒక లోతైనఅగాధం ఏర్పడుతున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుతో ఇరు రాష్ట్రప్రభుత్వాల వ్యవహారశైలి రచ్చకెక్కింది కేసులో రేవంత్రెడ్డి  ప్రత్యక్షంగా పట్టుబడగా... ఏపీ సీఎం  చంద్రబాబు  నాయుడు  వెనుక ఉండి నడిపించారంటూతెలంగాణ ప్రభుత్వం ప్రచారం  చేసింది.  చంద్రబాబు  గొంతుగా చెబుతున్నఆడియో టేపునూ బయటపెట్టిందిఏకంగా  ముఖ్యమంత్రే లక్ష్యంగా పక్క  రాష్ట్రప్రభుత్వం పావులు కదపడాన్ని... ఆంధ్రప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది.పోటీగా ఏపీలో కేసీఆర్పై ఆయా సందర్భాల్లో నమోదైన 87 కేసులనుతవ్వితీసిందిఅంతేకాదు...  కేసులను ఆగమేఘాల మీద సీఐడీకిఅప్పగించింది కూడాతమకు ఏదైనా హాని తలపెడితే.. తామేంటో చూపిస్తామన్నస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు మానసికంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైందినేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కేసులో తెంగాణ ప్రభుత్వంనోటీసులు ఇవ్వబోతుందన్న ప్రచారంతో రెండుమూడు రోజులు హైదరాబాద్లో తీవ్రఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయిఅటు.. ఆత్మరక్షణలో బడ్డ టీడీపీపార్టీతోపాటు... సీఎంకు రక్షణగామంత్రులకు రక్షణగా ఏపీ ప్రభుత్వం తమబలగాలను దింపిందిమంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.ఇంకా నిత్యం విమర్శ ల జోరు కొనసాగుతూనే ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య రగడతో మీడియా కూడా రెండుగా చీలిన సందర్భంగోచరిస్తోందిపత్రికలు తిరగేసినా..  టీవీ  చూసినా... ఎందులో  వచ్చింది వాస్తవమో,  దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక సాధారణ పాఠకులు,ప్రేక్షకులు అయోమయంలో పడిపోతున్నారుతెలంగాణ అనుకూల పత్రికల్లోవస్తున్న వార్తలుఆంధ్రప్రదేశ్ అనుకూల మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లోతేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందిచివరకు సెక్షన్`8 విషయంలో కేంద్రాన్నీమధ్యలోకి దింపింది వర్గం మీడియాఒకే వార్త రెండు భిన్న పత్రికల్లో రెండువిభిన్న పార్శ్వాల్లో వస్తుండటంతో ఏది వాస్తవమో   తెలియక   జనం  జుట్టుపీక్కుంటున్నారుమీడియాలో వస్తున్న గందరగోళ సమాచారానికి ముగింపుపలికేలా... కేంద్రం జోక్యం  చేసుకోవాని  ఎవరికి   వారు అంటున్నారుకేంద్రంప్రత్యక్ష జోక్యానికి సిద్ధంగా లేదు.
రాష్ట్రం విడిపోక ముందు రాజకీయపార్టీలు ప్రజలను ఎలా పావుగావాడుకున్నాయో.. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా వాటి వ్యవహారశైలిఅలాగే కొనసాగుతున్నదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారుఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యంనెలకొనాలని ఆశిద్దాంఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఐకమత్య భావనపెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది.
హంసిని సహస్ర సాత్విక
(లోకహితం మాసపత్రిక June-15లో ప్రచురితం)