16, ఆగస్టు 2013, శుక్రవారం

వర్షాంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరదల ధాటికి నాలుగు జిల్లాల్లో ఐదుగురు గల్లంతయ్యారు. చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు  కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ అధికారులు తెలిపారు.  

15, ఆగస్టు 2013, గురువారం

హైందవ సంకేతం...!

 

 

- భారతదేశం హైందవ సంస్కృతీ సమ్మేళనం
- లౌకిక భావమే హైందవ సంస్కృతి విశేషం
- ముస్లింను రాష్ట్రపతిని చేసిన ఘనత మన సొంతం
- విశ్వానికే అది మన ఘనమైన సందేశం

ఇప్పుడు...
- కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాటం
- తన గురించి ఏకరువు పెట్టిన దిగ్విజయ్ వైనం
- తాను హిందువునే అని చెప్పకోవడం
- తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయమా?
- దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనా?

ఇక...
- రెండు దశాబ్దాల తర్వాత మనసు విప్పిన ములాయం
- 90వ దశకాన్ని చేసుకున్నారు మననం
- కరసేవకులపై కాల్పుల కలకలం
- చింతిస్తున్నానంటూ ప్రకటించటం
- ఇది రాజకీయమా? పరిస్థితుల ప్రాబల్యమా?

ఇదీ వాస్తవం...
- హిందువులమని గర్వంగా చెప్పుకుంటున్న నాయకగణం
- హిందూత్వ ఆవశ్యకతను గుర్తిస్తున్న వాతావరణం
- నాడు సంకుచిత భావంతో దాచారు మన సంస్కృతిని
- ఆ గతానికి చెల్లిపోతోంది కాలం
- గత అభిప్రాయాలను పాతరేస్తున్న వర్తమానం
- భవిష్యత్ భారతానికి నిలువెత్తు సంకేతం
 
- హంసినీ సహస్ర

14, ఆగస్టు 2013, బుధవారం

పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌
కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు.. ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలతో కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఇవాళ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఆంటోనీ కమిటీ భేటీ కానుంది.