28, అక్టోబర్ 2013, సోమవారం

దేశానికి ఎవరు దిక్కు?


ప్రధానమంత్రి...
భారత ఔన్నత్యాన్ని చాటే పదవి
దేశ ప్రజలందరికీ ప్రతినిధి
పాలనాపరంగా ఉండాలి...
ప్రజలందరికీ జవాబుదారీ

పెద్దదిక్కు...

అవినీతి ఆరోపణలు వస్తే...
ఆర్థిక వ్యవస్థ పతనమైతే...
సమస్యలతో సందిగ్ధం నెలకొంటే...
దారిలో పెట్టడం ఆయన విధి

తగ్గారు...

నేర చరితులపై వేటుకు...
సుప్రీంకోర్టు ఆదేశం
దీనిపై ఆర్టినెన్స్‌కు ప్రయత్నించిన ప్రభుత్వం
రాత్రికి రాత్రే వెనక్కి తగ్గిన మన్మోహన్‌

లోగుట్టు...

ఆర్డినెన్స్‌ను చింపేయాలన్న రాహుల్‌
శరవేగంగా స్పందించిన పీఎం
ఆలోచన విరమించుకున్న UPA సర్కార్‌
చివరకు బుట్టదాఖలైన ఆర్డినెన్స్‌

కోల్‌గేట్...

దేశాన్ని కుదిపేసిన కోల్‌ కుంభకోణం
ప్రత్యక్ష సంబంధం లేదన్న మన్మోహన్‌
తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం
ఒడిశా సీఎంపైకి నెపం నెట్టేందుకు యత్నం

కాలింది...

 మాజీ కోల్‌సెక్రెటరీపై CBI కేసు
తనతో పాటు ప్రధానినీ ప్రశ్నించాలన్న పరేఖ్‌
ఉలిక్కిపడ్డ ప్రధాని మన్మోహన్‌
ప్రశ్నిస్తే సిద్ధమేనంటూ మాట మార్చిన వైనం

జవాబుదారీ...

కొన్నాళ్లనుంచి వరుస పరిణామాలు
అయినా.. మౌనమే నాదారి అంటున్నారు
ఓ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారన్న వాదనలు
సోనియాకు జవాబుదారీగా ఉంటున్నారన్న ఆరోపణలు

మన్మోహన్‌ జీ...

సమర్థుడు, సౌమ్యుడు అన్న అభిప్రాయం
వ్యక్తిగతంగా అందరికీ గౌరవం
వ్యవహారశైలితో మారుతోంది గళం
అసమర్థుడంటూ విమర్శల వర్షం

- హంసినీ సహస్ర

4 కామెంట్‌లు: