26, నవంబర్ 2015, గురువారం

మన్‌కీబాత్‌లో అవయవదానాన్ని నొక్కి చెప్పిన మోదీ




ప్రజల భాగస్వామ్యంతోనే దేశాన్ని నడిపించాలన్న మహోన్నత లక్ష్యం మోదీ మన్కీ బాత్ కార్యక్రమము. తాజాగా అక్టోబర్25 తేదిన నిర్వహించిన మన్కీబాత్ కార్యక్రమంలో పలు అంశాలపై మోదీ మనసు విప్పి ముచ్చటించారు. అవయవదానాన్ని ఉద్యమంలా చేపట్టాల్సిన ఆవశ్యకతను నరేంద్రమోదీ గుర్తుచేశారు. దేశంలో అవసరమైన అవయవ దానాలు జరగడం లేదని చింతిస్తూనే దాన్ని అధిగమించడానికి చేయాల్సిన ప్రయత్నాలను విశదీకరించారు. ప్రతి సంవత్సరం దేశంలో రెండున్నర లక్షలకంటే ఎక్కువగా మూత్రపిండాలు, గుండె, కాలేయదానం అవసరం ఉండగా కేవలం ఐదువేల అవయవ మార్పిడులే జరుగుతున్నాయని చెప్పారు. లక్ష కళ్ళకు చూపు అవసరమవుతుండగా 25 వేల వరకే చేయగుగుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వాళ్ళ అవయవలను కూడా దానం చేయవచ్చని, ఇందుకోసం చట్టపరమైన అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. అవయవదానం పట్ల స్ఫూర్తి కలిగేలా కేరళలోని చిత్తూర్లో ఉన్న సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థులు వేలిముద్రతో తయారు చేసిన భారతమాత చిత్రాన్ని తనకు పంపించారని.. వారిని అభినందించారు. మహారాష్ట్రకు చెందిన వసంతరావు సుడ్కే గురూజీ అవయవదానం పట్ల సాగిస్తున్న ఉద్యమానికి అభినందనలు తెలిపారు. అవయవదానం ఒక వృత్తి, ప్రవృత్తిలాగా మారాలని ఆకాంక్షించిన మోదీ దేశంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ఫ్లాంట్ ఆర్గనైజేషన్ (నోటో)ను స్థాపించామని చెప్పారు.
ఇండో ఆఫ్రికన్ సమ్మిట్ కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థిని రాసిన కవితను మోదీమన్కీబాత్కార్యక్రమంలో కొంత భాగాన్ని చదివి వినిపించారు. ఈసారి మోదీ మన్కీబాత్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల ప్రస్తావని తీసుకురావటం విశేషంగా చెప్పకోవచ్చు. విజయనగరం జిల్లాకు చెందిన కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు ద్వారపూడి గ్రామ పంచాయతీని ఆదర్శగ్రామంగా ఎంపిక చేసుకొని సృజనాత్మకమైన పనిచేపట్టారని ప్రధాని ప్రశంసించారు. గ్రామంలోని 550 మంది నిరాక్షరాస్యులైన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలే రోజూ సాయంత్రం గ్రామంలోని పాఠశాలలో చదువు చెబుతున్నారని, ఎలాంటి బడ్జెట్, సర్క్యులర్, ఆదేశాలు, ప్రత్యేక వ్యవస్థ లేకుండానే. కేవలం సంకల్పబలంతో ఇంత పెద్ద పరిణామం తీసుకొచ్చారని నరేంద్రమోదీ ప్రశంసించారు. అలాగే స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఈనాడు, ఈటీవీ గ్రూప్స్ అధినేత రామోజీరావు ప్రజల్లో తెస్తున్న చైతన్యాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా సంస్థలైన ఈనాడు, ఈటీవీ గ్రూప్స్ పరిశుభ్రత కార్యక్రమాన్ని మిషన్లాగా చేపట్టాయని ప్రశంసించారు.అలాగే ఏబీసీ న్యూస్ ఛానెల్, ఎన్డీటీవీ, దైనిక్ జాగరణ్, జీ నెట్వర్క్ మీడియా సంస్థలను ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న తీరును ప్రస్ఫుటించారు ప్రధానిమోది. దేశంలోని దాదాపు అన్ని మీడియా సంస్థలు పరిశుభ్రతపై ప్రచారం చేపట్టాయని చెప్పారు. అతిచిన్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరం నుండి లోక్సభకు ప్రాతినథ్యం వహిస్తున్న సి.ఎల్.రువాలా.. అక్కడి రువాం గ్రామంలో మార్చి 11 తేదిన చెరుకు ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా అమ్మకాలు పెరిగి గ్రామ ఆర్థికస్థితి మెరుగుపడిందని మోదీ మన్కీ బాత్లో తెలిపారు. ఇక పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు ఇంటర్వూ సమయంలో సిఫార్సు పేరిట నష్టపోతున్నారన్న వాదన నేపథ్యంలో.. వచ్చే జనవరి1 నుంచి గ్రూప్`డి, గ్రూప్`సి, గ్రూప్`బి నాన్గెజిటెడ్ ఉద్యోగా భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అదే విధంగా బంగారాన్ని నగదుగా మార్చుకునే పథకాన్ని తీసుకొచ్చామన్న మోదీ.. పథకం నేపథ్యం, వివరాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఇకపై 5గ్రాముల, 10గ్రాముల, 20గ్రాముల బంగారునాణాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇప్పటిదాకా బంగారంపై విదేశీ ముద్రలే ఉన్న కారణంగా స్వదేశీ ముద్ర ఎందుకు ఉండొద్దన్న భావనతో అశోకచక్రంతో కూడిన బంగారు నాణేలు తయారు చేస్తున్నామన్నారు. దీపావళి మరునాడు తన బ్రిటన్ పర్యటన గురించి కూడా మోదీ ప్రస్తావించారు. లండన్లో డాక్టర్ అంబేద్కర్ నివశించిన నివాసం ఇప్పుడు భారత సంపద అయ్యిందని దాన్ని ప్రారంభించేందుకు బ్రిటన్ వెళ్తున్నానన్నారు. బ్రిటన్కు పైచదువు కోసం వెళ్ళే భారతీయులకు అంబేద్కర్ నివాసం పుణ్యక్షేత్రం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ప్రేరణతో భారతీయ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు, కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగత భావనను కూడా నరేంద్రమోదీ వెలిబుచ్చా రు. దీపావళి పర్వదినం సమీపిస్తున్నందున పండుగ సంబరాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, పిల్లలు టపాకాయలు కాల్చే విషయంలో తల్లిదండ్రులు జాగరూకత వహించాలని జాగ్రత్త చెప్పారు. తర్వాత రోజు పండుగ వ్యర్థాలు శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 25 జరిగిన మోదీ మన్కీబాత్ యేడాది పూర్తిసుకుంది.

-  లోకహితం మాసపత్రిక (నవంబర్‌ 2015)లో ప్రచురితం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి