అడుగుజాడ

పేజీలు

  • హోమ్
  • సొంత కవిత్వం
  • రైలుమిత్ర
  • వెబ్‌సైట్‌

11, మే 2018, శుక్రవారం

హైకోర్టు మొట్టికాయలు



తెలంగాణ ప్రభుత్వానికి గతవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉందని, విపక్షాల్లో సరైన నాయకులు లేరని, వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని కలలు కంటున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓ రెండు నిర్ణయాలు తలబొప్పికట్టించేలా మారాయి. ఆ రెండూ న్యాయస్థానాల్లో తగిలిన ఎదురుదెబ్బలే కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో తమకు ఎదురే లేదన్న అత్యుత్సాహంతో దూసుకెళ్తోన్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పరిణామాలతో కాస్త ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో రాజకీయంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టని కెసిఆర్‌ సర్కారు ప్రస్తుతం వచ్చే నెలలో రైతులకు పెట్టుబడి పథకం కింద నాలుగువేల రూపాయలు అందించే ‘రైతుబంధు’ పథకంపై దష్టిపెట్టింది.
ఎంఎల్‌ఏల బహిష్కరణ ఎత్తివేత
ఎంఎల్‌ఏల అనర్హత వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై తెలంగాణ అసెంబ్లీ విధించిన బహిష్కరణ వేటును రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎత్తేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది. వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ, అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం సరికాదని ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేశారు. గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సభలో క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించా రంటూ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్‌కుమార్‌పై బహిష్కరణ విధించింది. వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు అధికారిక ప్రకటన జారీచేసింది. మరో అడుగు ముందుకేసి ఎంఎల్‌ఏల బహిష్కరణతో ఖాళీ అయిన నల్గొండ, అలంపూర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అంతేకాకుండా బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాకుండా జానారెడ్డి సహా కాంగ్రెస్‌ శాసనసభ్యులందరిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే ఈ బహిష్కరణ ఉదంతంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సంబం ధించిన ఆధారాలను ఇవ్వాలని కోర్టు ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో పలుమార్లు వాదనలు విన్న హైకోర్టు కాంగ్రెస్‌ సభ్యులకు ఊరట కలిగిం చేలా తీర్పు వెలువరించింది. కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లు యథా విథిగా తమ పదవుల్లో కొనసాగొచ్చని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలన్నీ రద్దయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
మరోవైపు హైకోర్టు సింగిల్‌బెంచ్‌ తీర్పుపై టిఆర్‌ఎస్‌ అప్పీల్‌కు వెళ్లింది. రాజకీయ కోణంలో భాగంగా అధికార పార్టీకి చెందిన 12 మంది ఎంఎల్‌ఏలతో తీర్పును సమీక్షించాలంటూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించింది. హైకోర్టు తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమీక్షించాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘సభ్యుల కంటే సభ గౌరవం అత్యంత ముఖ్యం. సభ గౌరవానికి ఎవరు భంగం కలిగించినా చర్యలు ఉండాల్సిందే. భవిష్యత్‌కు ఆ మేరకు సంకేతం ఉండాలి’ అని టిఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ సభ్యుల బహిష్కరణ, హైకోర్టు తీర్పు, ప్రభుత్వ ఆలోచనలపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సభ్యులపై వేటు నిర్ణయం సభ తీసుకుంది కాబట్టి న్యాయస్థానం తీర్పును చర్చించడానికి అసెంబ్లీని సమావేశపరచా లన్న ఆలోచన కూడా వచ్చినట్లు చెబుతున్నారు.
కోదండరాం సభకు కోర్టు అనుమతి
తెలంగాణ జనసమితి పార్టీకి కూడా హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 29న ఆ పార్టీ నిర్వహించే సభకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. టిజెఎస్‌ వ్యవస్థాపకుడు కోదండరాం ఏప్రిల్‌ 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ సభకు అనుమతి ఇవ్వలే మని పోలీసులు, సరూర్‌నగర్‌ గ్రౌండ్‌ నిర్వాహకులు చెప్పారు. నగరంలో ఏదో ఒక స్టేడియంలో గానీ, ఖాళీస్థలంలో గానీ అనుమతి ఇచ్చినా సరేనని టిజెఎస్‌ కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో తెలంగాణ జనసమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సభకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
కోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో స్టేడియంలో ఏర్పాట్లకు టిజెఎస్‌ నేతలు సిద్ధ మయ్యారు. పార్టీ ఆవిర్భావ సభ ద్వారా రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టాలని కోదండరాం కార్య కర్తలకు విజ్ఞప్తి చేశారు. సభ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు పలు కమిటీలను సైతం ఏర్పాటు చేశారు.
పంచాయతీ ఎన్నికల కసరత్తు షురూ
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల కసరత్తును తెలంగాణ ఎన్నికల కమిషన్‌ వేగవంతం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితా కార్యాచరణను మే 17కల్లా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. దాని ప్రకారం ఈ నెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మే నెల 1న ఎన్నికల సంఘం అధికారులు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో, 3న మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మే 1 నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యంతరాలను మే 10వ తేదీలోపు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వార్డుల విభజనతో సహా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను మే 17న ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్‌ చట్టం-2018కి అనుగుణంగా ఈ ఎన్నికలుంటాయని తెలంగాణ ఎన్నికల సంఘం పేర్కొంది.
– సప్తగిరి (http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%b9%e0%b1%88%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b1%81/) 
(Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ30 Apr - 6 May 2018)
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 12:46 AM
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: కామెంట్‌లను పోస్ట్ చేయి (Atom)

Stat counter

View My Stats

మొత్తం పేజీ వీక్షణలు

బ్లాగు ఆర్కైవ్

  • ►  2022 (1)
    • ►  సెప్టెంబర్ (1)
  • ►  2020 (1)
    • ►  జనవరి (1)
  • ►  2019 (78)
    • ►  డిసెంబర్ (10)
    • ►  నవంబర్ (2)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (11)
    • ►  జులై (4)
    • ►  జూన్ (44)
    • ►  ఏప్రిల్ (6)
  • ▼  2018 (47)
    • ►  నవంబర్ (18)
    • ►  జూన్ (2)
    • ▼  మే (12)
      • టి-కాంగ్రెస్‌లో కులకుంపట్లు
      • టి-కాంగ్రెస్‌లో కుల కుంపట్లు
      • కాంగ్రెస్‌లో కుర్చీ కొట్లాట షురూ... (May 21-27 issue)
      • కారగ్రెస్‌లో కుర్చీ కొట్లాట షురూ
      • ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ? (14-20 May 2...
      • ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?
      • ఒక్క సభ.. రెండు లక్ష్యాలు... (7th May)
      • ఒక్క సభ… రెండు లక్ష్యాలు…
      • హైకోర్టు మొట్టికాయలు (30th April)
      • గుట్టువిప్పిన కాగ్‌ (9th April)
      • హైకోర్టు మొట్టికాయలు
      • బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ
    • ►  ఏప్రిల్ (7)
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (4)
  • ►  2017 (11)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (7)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2016 (17)
    • ►  ఆగస్టు (4)
    • ►  జులై (1)
    • ►  జూన్ (1)
    • ►  మే (3)
    • ►  మార్చి (2)
    • ►  ఫిబ్రవరి (5)
    • ►  జనవరి (1)
  • ►  2015 (17)
    • ►  డిసెంబర్ (3)
    • ►  నవంబర్ (3)
    • ►  అక్టోబర్ (3)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  ఫిబ్రవరి (2)
  • ►  2014 (35)
    • ►  డిసెంబర్ (6)
    • ►  నవంబర్ (1)
    • ►  సెప్టెంబర్ (4)
    • ►  ఆగస్టు (10)
    • ►  జులై (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (4)
    • ►  జనవరి (1)
  • ►  2013 (17)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (2)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (9)
  • ►  2012 (9)
    • ►  మార్చి (1)
    • ►  జనవరి (8)
  • ►  2011 (4)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (2)

నా గురించి

Sapthagiri
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

FLAG Counter

Flag Counter

ప్రముఖ పోస్ట్‌లు

  • ఇస్లాం తొలిప్రవక్త శివుడే...!
            ఓవైపు ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చ...
  • ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)
    ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం                         - గోపగోని సప్తగిరి, 98850 86126.     భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే...
  • Journalism & Media Glossary
    Journalism, like any profession, has its own language and specialist words which practitioners need to know. The following gl...
  • ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?
        తెలంగాణ   ముఖ్యమంత్రి   కె .  చంద్రశేఖర్ ‌ రావు   మానసపుత్రికగా   చెప్పుకుంటున్న డబుల్ ‌   బెడ్ ‌ రూమ్ ‌   ప్లాట్స్ ‌   పథకం  ...
  • రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం
        సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్ల...
  • రూపాయి - పాపాయి
    ఇదీ వాస్తవం ! చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్ ఇదే యూపీఏ తాజా నినాదమట కానీ చేతులు ఇప్పటికే బొబ...
  • (శీర్షిక లేని)
    పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌ కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశా...
  • అమ్మ..!!?
    అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్...
  • శ్రీ జయనామ సంవత్సర పంచాంగం, రాశి ఫలాలు (2014-15)
    పంచాంగ పీఠిక కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియు...
  • సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
              506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్న...
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.