14, ఫిబ్రవరి 2016, ఆదివారం

వ్యవసాయానికి మోదీ సర్కారు ధీమా



వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా చెప్పుకునే భారతదేశాన్ని ప్రస్తుతం కర్షకుల కొరత పట్టి పీడిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయం చేయాలన్న ఆలోచన రోజు రోజుకూ మన మస్తిష్కా ల్లోంచి కనుమరుగైపోతోంది. కర్ణుడి చావుకు కారణాలానేకం అన్నట్లు.. మనదేశంలో వ్యవసాయానికి ఆదరణ తగ్గడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ.. ఆహారం లేకుండా మానవ మనుగడ అసాధ్యం. నేపథ్యంలో వ్యవసాయాన్ని అంటిపెట్టుకొని, సేద్యంపైనే ఆధారపడి జీవిస్తున్న అతికొద్ది మందికైనా అందరం అండగా, ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకైతే బాధ్యత మరింత ఎక్కువ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరి చేందుకు ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్రధానమంత్రి పంటల బీమా పథకంఒకటి. దేశంలోని రైతుల్లో భరోసా నింపేదిగా పథకాన్ని రూపొందించారు. పంటల బీమా పథకం రైతు జీవితాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా మన్కీబాత్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (ూవీఖీద్)
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకం కర్షకులకు ఊరట నిచ్చేదిగా ఉంది. ఆహారధాన్యాలు, నూనె గింజలతో పాటు.. వాణిజ్యపంటలు, ఉద్యాన పంటలను భీమా పరిధిలోకి తెచ్చారు. అయితే..రైతు భరించాల్సిన ప్రీమియం వేర్వేరుగా ఉంది.  ఆహార ధాన్యాలు, నూనె గింజల  పంటలకు ఖరీఫ్ అయితే.. బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతు 2శాతం చెల్లిస్తే సరిపోతుంది. అదే రబీలో అయితే రైతు చెల్లించాల్సిన వాటా 1.5 శాతం మాత్రమే. మిగతా ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి. ఇక.. వాణిజ్య పంటలు, ఉద్యాన పంటల బీమాకు రైతు 5శాతం బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇది కూడా అతి తక్కువే కదా.. యేడాది జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ సీజన్లో వేసే పంట నుంచి బీమా అమలులోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల  వల్ల కలిగే పంట నష్టానికి పూర్తి భీమాను రైతుకు చెల్లిస్తారు. స్వతంత్ర భారత చరిత్రలో రైతు అతిక్కువ ప్రీమియం చెల్లించే పంటల బీమాదే అవుతుందని హోం మంత్రి రాజానాథ్ సింగ్ ప్రకటించారు. కౌలు రైతుకు కూడా బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పారు.  ప్రస్తుతం రెండు పంటల బీమా పథకాల కింద రైతు చెల్లించాల్సిన ప్రీమియం పంటలు, ప్రాంతాలను బట్టి 15శాతం నుంచి 57శాతం వరకు ఉంది. ఇప్పటిదాకా అమలవుతోన్న జాతీయ వ్యవసాయ బీమా పథకం స్థానంలో ూవీఖీద్ అమవుతుంది. కొత్త బీమా పథకం కోసం కేంద్రం తయారుచేసిన అంచనా ప్రకారం 19,440 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణంలో సగం పంట బీమా ప్రీమియం చెల్లించడానికి కేంద్రం సుమారు 9,500 కోట్ల రూపాయలు భరించనుంది
 
 
కొత్త పంటలభీమా పథకం తీరుతెన్ను :
  • పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు.. విత్తు/నాట్లు వేయలేక పోవడం, పంట కోత తర్వాత జరిగే నష్టాలకూ బీమా వర్తిస్తుంది.
  • వరద ముంపువంటి విపత్తుకు బీమా వర్తిస్తుంది.
  • పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25శాతాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.
  • క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతారు. స్మార్ట్ ఫోన్ ద్వారా పంటకోత సమాచారాన్ని ఫోటోలు తీసి, అప్లోడ్ చేస్తారు. పంట కోతతో పరిశీలనను తగ్గించేందుకు రిమోట్ సెన్సింగ్ను వినియోగిస్తారు.
  •  బ్యాంకు రుణాలు తీసుకున్నవారికి పంట బీమా తప్పనిసరి చేశారు.
  • ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం 90శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం భరిస్తుంది.
  • ప్రీమియం ధరపై పరిమితిని విధిస్తున్న నిబంధనల మూలంగా రైతుకు తక్కువ క్లెయిము చెల్లిస్తున్నారన్న ఫిర్యాదుతో నిబంధనను ప్రభుత్వం తొలగించింది.  బీమా చేసిన పూర్తి మొత్తాన్ని ఎలాంటి మినహాయింపు లేకుండా రైతుకు చెల్లిస్తారు.
  •  వచ్చే మూడేళ్లలో మొత్తం పంట విస్తీర్ణంలో బీమా కవరేజీని 50శాతానికి పెంచుతారు. ఇందుకు యేడాదికి 17,600 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈమొత్తాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.
  •   తొలియేడాది 2016-17లో మొత్తం పంట విస్తీర్ణంలో 30 శాతానికి బీమా వర్తింపజేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 5వేల 700 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
  • మొత్తం రాష్ట్రానికి ఒక బీమా కంపెనీ ఉంటుంది. విపత్తుతో జరిగే నష్టానికి, కోత తర్వాత జరిగే నష్టానికి పొలం స్థాయిలో అంచనా వేస్తారు. భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు ప్రైవేటు బీమా కంపెనీలు కూడా పథకాన్ని అమలు చేస్తాయి.
     
     - లోకహితం మాసపత్రికలో ప్రచురితం  (ఫిబ్రవరి, 2016)
     http://www.lokahitham.net/2016/02/blog-post_41.html
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి