20, ఆగస్టు 2014, బుధవారం

భారీగా నమోదైన తెలంగాణ జనాభా



              తెలంగాణలో కుటుంబాల సంఖ్య ఒక కోటి ఐదు లక్షలుగా నమోదైంది. జనాభా ఐదుకోట్లకు పైగానే ఉంటుందని తేలుతోంది. 2011 జనాభా లెక్కలను మించి కుటుంబాలు నమోదయ్యాయి. సమగ్ర కుటుంబ సర్వే.. రాష్ట్రంలోని కుటుంబాల లెక్కని పక్కా చేసింది. మొత్తం 1,05,76,922 కుటుంబాలను నమోదు చేసింది. 2011 జనగణనను అధిగమించి.. ఐదు కోట్లకు పైగా జనాభాను లెక్కలేసి చూపించింది. తెలంగాణలో 2011 గణాంకాల ప్రకారం 86.85 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ మూడేళ్లలో 19 లక్షలకు పైగా కుటుంబాలు పెరిగినట్టు సమగ్ర సర్వేలో తేలింది. హైదరాబాద్‌ను కలుపుకొని తెలంగాణ జిల్లాలన్నింటా ఇంకా  2 లక్షల 30 వేల 655 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది.  ఇక సర్వే ద్వారా సేకరించిన డేటా ఎంట్రీ కోసం జీహెచ్‌ఎంసీ మినహా తొమ్మిది జిల్లాల్లో 17 వేల 140 కంప్యూటర్‌లను వినియోగించుకోనున్నారు. 381 కేంద్రాల్లో డేటా ఎంట్రీ జరగనుంది.  అయితే.. హైదరాబాద్‌లో మాత్రం సర్వే లెక్క తప్పింది. 2011 జనాభాలెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 15,24,392 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభాపరంగా 68,09,970 మంది ఉన్నట్టు జనగణన తేల్చింది. కానీ.. సమగ్రసర్వే పూర్తయితే హైదరాబాద్‌లో కుటుంబాల సంఖ్య 22,28,818కు చేరుకునే అవకాశం ఉంది. నగర జనాభా కోటి దాటుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి