7, మార్చి 2014, శుక్రవారం

రాష్ట్రంలో ఎన్నికల జాతర

 

         రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలైంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఇప్పటికే మూడు ఎన్నికలు ఖరారు కాగా... మరో ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధమైంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు తోడు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపాలిటీలకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పుడు తాజాగా జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలపైనా సుప్రీంకోర్టు కన్నెర్ర జేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. యేళ్లకు యేళ్లు ప్రత్యేక అధికారుల పాలన విధించడంపై ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయ వేసింది. దీంతో.. ప్రభుత్వం హడావిడిగా స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో... సోమవారం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి