15, జులై 2013, సోమవారం

హస్తిన చుట్టూ క్షిపణి కవచం


భివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భారతదేశం శత్రుదుర్భేద్యంగా మారుతోంది. శత్రు దేశాల క్షిపణులను సైతం ఎదుర్కొనేలా దేశం రూపుదిద్దుకొంటోంది. ఇందుకోసం మన శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి నైపుణ్యాన్ని వినియోగించుకుంటున్నారు. అత్యాధునిక రాడార్ లు, శత్రు నిరోధక క్షిపణులను అమర్చగలిగే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారు. వీటిని వలయాకారంగా అమర్చడం ద్వారా శత్రు క్షిపణులను ఎదుర్కోగలిగే రక్షణ కవచం ఏర్పడుతుంది. 

ఇప్పుడున్న టెక్నాలజీతో 2 వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే క్షిపణులను కూడా అడ్డుకొని ధ్వంసం చేయగలిగే సామర్ధ్యం మనకుంది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అని పిలిచే ఈ టెక్నాలజీలో భాగంగా రెండు దశల్లో ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేందుకు డి.ఆర్.డి.ఎ. సిద్ధంగా ఉంది. తొలిదశ ఇప్పటికే పూర్తి కాగా, రెండో దశ కూడా పూర్తయితే 5 వేల కిలోమీటర్ల నుండి దూసుకొచ్చే క్షిపణులను కూడా నిరోధించగలిగే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ క్షిపణి కవచాన్ని దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ మోహరించేందుకు డి.ఆర్.డి.ఎ. సిద్ధంగా ఉంది.   

- హంసినీ సహస్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి