10, జులై 2013, బుధవారం

సినిమా ముసుగులో మరోసారి ఇస్లామీల విధ్వంసం

లిబియాలో హత్య కాబడ్డ అమెరికా దౌత్యవేత్త క్రిస్టర్స్ స్టీవెన్స్
"ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్" సినిమాపై వ్యతిరేకత వెర్రితలలు వేస్తోంది. ఆగ్రహం దేశాల సరిహద్దులు దాటింది. ఆగడాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆందోళనలు హద్దు దాటుతున్నాయి. అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకొన్నట్లుగా ఎక్కడో, ఎవరో, ఏదో కారణంతో చేసిన దానికి ముస్లిములు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, ఎలా తోస్తే అలా నిరసనల పేరుతో విధ్వంసానికి దిగుతున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. అంతర్జాతీయ జిహాదీ బీభత్సకాండను తలపింప చేస్తున్నారు. 
ముస్లిం సినిమా ముసుగులో ఇటీవల ఇస్లాం మతస్తులు తెగబడ్డ ఘటనలు ఒకసారి చూద్దాం.
ముస్లింల వెర్రి వేషం లిబియాలో అమెరికా దౌత్యవేత్త క్రిస్టర్స్ స్టీవెన్స్ ను బలి తీసుకుంది. మరో ముగ్గుర్ని సజీవదహనం చేసింది.
ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణం చెందారు.
యెమన్ రాజధాని సనాలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పులలో ఒకరు చనిపోయారు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో వందలాది మంది నిరసనకారులు రాళ్ళు రువ్వడంతో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు.
ఆఫ్రికా దేశం సూడాన్ లోనూ ముస్లింలు రాజధాని కర్తోమ్ లోని అమెరికా ఎంబసీపై దాడికి విఫల ప్రయత్నం చేశారు.
కైరోలో ఆందోళనకారుల దాడుల్లో 70 మంది గాయపడ్డారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో వేలమంది ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు.
లండన్ లోని అమెరికా రాయబార కార్యాలయం ముందు సుమారు రెండు వందల మంది ముస్లింలు నిరసన తెలిపారు.
సూడాన్ లో రాయబార కార్యాలయం ఆందోళనకారుల దాడులతో దద్దరిల్లింది.
ఖర్దుంలోని జర్మన్ ఎంబసీ కూడా నిరసనలకు దగ్ధమైంది.
ట్యునీషియా, ఇరాక్, మొరాకో, సూడాన్, జర్మనీ, బ్రిటన్, ట్యునిష్, ఈజిప్టు, యెమన్, లెబనాన్, పాకిస్తాన్ దేశాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి.
భారత్ కూ పాకిన ఈ ఇస్లాం చిచ్చు సామాన్యులకు ప్రాణసంకటంగా మారింది.
కాశ్మీర్ లో హింస చోటు చేసుకుంది. వేలాదిమంది ర్యాలీగా వచ్చి ఉప ముఖ్యమంత్రి నివాసం వద్ద ఓ ప్రభుత్వ వాహనానికి నిప్పు పెట్టారు.

సుమారు 300 మంది ముస్లిములు చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
ఒకవేళ చిత్రంలో అసభ్యకర సన్నివేశాలుంటే వాటిని తొలగించాలని శాంతియుత ప్రదర్శన జరపడం రాజ్యంగ పధ్ధతి. ప్రజాస్వామ్యం వ్యవస్థీకృతమై ఉన్న అమెరికాలోని ముస్లింలు ఆ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. లేదా న్యాయస్థానాలలో పిటిషన్లు వేసి చిత్రాన్ని నిషేధింపచేయవచ్చు. అమెరికా దౌత్య సిబ్బందిని హత్య చేయడం ద్వారా ఒసామా లాడెన్ వధకు ప్రతీకారం తీర్చుకోవాలన్నది జిహాదీల వ్యూహమా? అన్ని దేశాలలోనూ బీభత్సకాండను సృష్టించడం ద్వారా ప్రభుత్వాలను అస్థిరత్వానికి గురి చేయడం జిహాదీల ప్రస్తుత పన్నాగమన్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు ఇంతగా ఆందోళనకారులు రెచ్చిపోతున్నా, మరోవైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఇంకా ముమ్మరం చేయాలంటూ లెబనాన్ షియా సంస్థ హిజ్బుల్లా పిలుపునిచ్చింది. ఈ చిత్ర దర్శకుడు శ్యాంబేసిల్ ను అమెరికాలో నిర్బంధించారు. 

- హంసినీ సహస్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి